రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు భూమన లేఖ
పీలేరులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
‘పంచాయతీ’ ముగిసేవరకూ ముందస్తుగా నిర్బంధించాలని వినతి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చిత్తూరు జిల్లాలో సీఎం కిరణ్కుమార్రెడ్డి సోదరుడు కిషోర్కుమార్రెడ్డి వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సీఎం సోదరుడి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు.. ఆయన్ను ముందస్తు నిర్బంధం చట్టం కింద అదుపులోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషనర్కు శనివారం భూమన ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులో వైఎస్సార్సీపీకి చెందిన సానుభూతిపరులను నామినేషన్లు దాఖలు చేయకుండా పోలీసులు, గుండాల సహాయంతో అడ్డుకుంటున్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు.
వీరి ఆగడాలపై జిల్లాలోని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో సర్పంచ్, వార్డు అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా దౌర్జన్యం చేయడమే కాకుండా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేసి, భౌతికదాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. ‘కలికిరి మండలం మర్రికుంటపల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నాగవేణి, వార్డు సభ్యులు లక్ష్మీదేవి నామినేషన్ వేయడానికి వెళ్లగా.. వారి నామినేషన్ పత్రాలను చించివేశారు. అలాగే కేవీ పల్లె మండలం మోటువాండ్లపల్లె నూతన కాల్వ పంచాయితీలో కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు’ అని వివరించారు. మీడియాపైనా భౌతికదాడులకు పాల్పడిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
ఇలా వరుస క్రమంలో చోటుచేసుకుంటున్న సంఘటనల దృష్ట్యా పీలేరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే సీఎం సోదరుడు కిషోర్కుమార్రెడ్డిని ముందస్తు నిర్బంధ చట్టం కింద ఎన్నికలు ముగిసే వరకు అదుపులోకి తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. దౌర్జన్యాలు, భౌతికదాడులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే విధంగా సంబంధిత అధికారులను ఆదేశించాలని విన్నవించారు. పీలేరు నియోజకవర్గంలో అక్రమాలు జరగకుండా నిరోధించడానికి ప్రత్యేక అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘానికి భూమన విజ్ఞప్తి చేశారు.
పీలేరులో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు
‘పంచాయతీ’ ముగిసేవరకూ ముందస్తుగా నిర్బంధించాలని వినతి
సాక్షి, హైదరాబాద్: పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా చిత్తూరు జిల్లాలో సీఎం కిరణ్కుమార్రెడ్డి సోదరుడు కిషోర్కుమార్రెడ్డి వ్యవహరిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. సీఎం సోదరుడి ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని, పంచాయతీ ఎన్నికలు ముగిసేవరకు.. ఆయన్ను ముందస్తు నిర్బంధం చట్టం కింద అదుపులోకి తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్రెడ్డికి ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కమిషనర్కు శనివారం భూమన ఓ లేఖ రాశారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పీలేరులో వైఎస్సార్సీపీకి చెందిన సానుభూతిపరులను నామినేషన్లు దాఖలు చేయకుండా పోలీసులు, గుండాల సహాయంతో అడ్డుకుంటున్న విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు.
వీరి ఆగడాలపై జిల్లాలోని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా.. వారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. పీలేరు నియోజకవర్గం కలికిరి మండలంలో సర్పంచ్, వార్డు అభ్యర్థులను నామినేషన్లు వేయనీయకుండా దౌర్జన్యం చేయడమే కాకుండా అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించివేసి, భౌతికదాడులకు పాల్పడుతున్నారని చెప్పారు. ‘కలికిరి మండలం మర్రికుంటపల్లె పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి నాగవేణి, వార్డు సభ్యులు లక్ష్మీదేవి నామినేషన్ వేయడానికి వెళ్లగా.. వారి నామినేషన్ పత్రాలను చించివేశారు. అలాగే కేవీ పల్లె మండలం మోటువాండ్లపల్లె నూతన కాల్వ పంచాయితీలో కూడా నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు’ అని వివరించారు. మీడియాపైనా భౌతికదాడులకు పాల్పడిన విషయాన్ని లేఖలో ప్రస్తావించారు.
ఇలా వరుస క్రమంలో చోటుచేసుకుంటున్న సంఘటనల దృష్ట్యా పీలేరు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగాలంటే సీఎం సోదరుడు కిషోర్కుమార్రెడ్డిని ముందస్తు నిర్బంధ చట్టం కింద ఎన్నికలు ముగిసే వరకు అదుపులోకి తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని కోరారు. దౌర్జన్యాలు, భౌతికదాడులపై ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే విధంగా సంబంధిత అధికారులను ఆదేశించాలని విన్నవించారు. పీలేరు నియోజకవర్గంలో అక్రమాలు జరగకుండా నిరోధించడానికి ప్రత్యేక అధికారులతో కమిటీని ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘానికి భూమన విజ్ఞప్తి చేశారు.
0 comments:
Post a Comment