వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా!

వైఎస్సార్సీపీ మద్దతుదారుల హవా!

Written By news on Thursday, July 18, 2013 | 7/18/2013

ఫలితమివ్వని కాంగ్రెస్, టీడీపీల కుమ్మక్కు
సీమాంధ్రలో వైఎస్సార్సీపీకి స్పష్టమైన ఆధిక్యం
తెలంగాణాలోనూ గణనీయ స్థానాలు కైవసం
సీఎం సొంత జిల్లాలో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్‌ను దెబ్బతీసే లక్ష్యంతో అధికార కాంగ్రెస్ విచ్చలవిడిగా డబ్బు వెదజెల్లినా.. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో కుమ్మక్కయినా పంచాయతీ ఎన్నికల్లోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ప్రభంజనమే కనిపిస్తోంది. ఏకగ్రీవమైన పంచాయతీల ‘లెక్క’ను చూస్తే ప్రత్యర్ధులపై వైఎస్సార్సీపీ స్పష్టమైన ఆధిక్యతను సాధించింది. సీమాంధ్ర జిల్లాల్లో వైఎస్సార్సీపీ హవా బలంగా ఉండటంతో కాంగ్రెస్, టీడీపీల కంటే దాదాపు రెట్టింపు స్థాయిలో సర్పంచ్‌ల స్థానాలను ఏకగ్రీవంగా గెలుచుకుంది. తెలంగాణ జిల్లాల్లో కూడా గణనీయమైన స్థానాల్లో వైఎస్సార్సీపీ మద్దతు దారులే సొంతం చేసుకున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రలోని ఒక్క విజయనగరం మినహాయిస్తే ఎక్కడా కూడా వైఎస్సార్సీపీకి కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. సాక్షాత్తూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సొంత జిల్లా చిత్తూరులో 150 పంచాయతీలు వైఎస్సార్సీపీ అభిమానుల పరం కాగా, కాంగ్రెస్ కేవలం 33, టీడీపీ 66 పంచాయతీలతో సరిపెట్టుకున్నాయి. వైఎస్సార్ జిల్లాలో కాంగ్రెస్, టీడీపీలు రెండూ కలిపి కేవలం 43స్థానాలకు మాత్రమే పరిమితం కాగా, వైఎస్సార్సీపీ మద్దతుదారులు ఏకంగా 101స్థానాలను కైవసం చేసుకున్నారు. కృష్ణా, ప్రకాశం, గుంటూరు, విశాఖ, శ్రీకాకుళం, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోనూ భారీసంఖ్యలో పంచాయతీలు వైఎస్సార్సీపీపరమయ్యాయి. ఈ జిల్లాల్లో కూడా కాంగ్రెస్, టీడీపీలు చతికిలపడ్డాయి.

ఇక ప్రచార పర్వం...

రాష్ట్ర వ్యాప్తంగా 2600 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవులకు ఏకగ్రీవం అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం గడువు ముగియడంతో ఉపసంహరణ తరువాత రంగంలో మిగిలిన అభ్యర్థులకు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 21,441 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుంటే, 2600 పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఇక్కడకు అందిన సమాచారం. సర్పంచ్ పదవులకు ఒకే నామినేషన్ వచ్చిన పంచాయతీలు 838 మాత్రమే ఉంటే.. ఉపసంహరణ పూర్తయిన తరువాత ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీల సంఖ్య దాదాపు మూడింతలు పెరగడం గమనార్హం. ఏకగ్రీవమైన పంచాయతీల్లో నిబంధనల ప్రకారం ఉపసర్పంచ్ ఎన్నికలను ఆయా గ్రామాల్లోని ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పూర్తి చేశారు. బుధవారం నామినేషన్ల ఉపసంహరణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘానికి అర్థరాత్రి వరకు జిల్లాల నుంచి పూర్తిస్థాయిలో సమాచారం రాలేదు. ఉపసంహరణ తరువాత ఎన్ని పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి..? ఎన్ని పంచాయతీలకు ఎంతమంది అభ్యర్థులు ఇంకా రంగంలో ఉన్నారన్న వివరాలు గురువారానికి కానీ వెల్లడించలేమని రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 2006లో జరిగిన ఎన్నికల్లో దాదాపు మూడువేల పైచిలుకు పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఇప్పుడా సంఖ్య తగ్గడం గమనార్హం. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటి దశ ఎన్నికల నిర్వహణపై దృష్టిపెట్టింది. పోటీలో ఉన్న అభ్యర్థులకు దాదాపు వారం రోజులు ప్రచార గడువు ఉండడంతో.. ప్రచారసరళిపై ప్రత్యేక దృష్టిపెట్టనుంది. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి అభ్యర్థులు, వారి వెన్నంటి ఉన్న రాజకీయ పార్టీల వ్యూహాలను తిప్పికొట్టడానికి ఎన్నికల సంఘం ప్రత్యేక నిఘా ఏర్పాట్లు చేసింది. ఎన్నికలు ఘర్షణ, దౌర్జన్యాలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రత్యేక పోలీసు బలగాలను రంగంలోకి దించారు. 

ఎక్కడ చిన్న గొడవ జరిగినా సమాచారం అందిన వెంటనే ఆ గ్రామానికి వెళ్లడానికి వీలుగా ఫ్లయింగ్ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. సాధారణ ఎన్నికల్లో ఉండే విధంగా ఈసారి సీనియర్ ఐఏఎస్ అధికారులను ఎన్నికల పరిశీలకులుగా ప్రతి జిల్లాకు ఇద్దరిని నియమించడంతోపాటు, అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని పరిశీలించడానికి ఒక్కో జిల్లాకు ఒక ఐఎఫ్‌ఎస్ అధికారిని నియమించారు. వీరంతా ఆయా జిల్లాల్లో మకాం వేసి పరిస్థితి సమీక్షించనున్నారు. ధన, మద్యం ప్రవాహాన్ని అడ్డుకోవడానికి ఎక్సైజ్, పోలీసు అధికారులు కలిసి దాడుల నిర్వహించాలని, వాహనాలను తనిఖీ చేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఇప్పటికే పోలీసులు వాహనాల తనిఖీల్లో లక్షలాది రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. సమస్యాత్మక, సున్నితమైన గ్రామాల్లో ఎక్కువ పోలీసు బలగాలను నియమించాలని, ఇదివరకు కేటాయించిన పోలీసు సిబ్బందిని, ఏకగ్రీవమైన పంచాయతీల నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని పోలీసు ఉన్నతాధికారులను కోరింది. ఓటర్లు నిర్భయంగా ఓటేయడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సూచించింది. ఓటర్లు 14 రకాల గుర్తింపు కార్డుల్లో ఏది చూపించినా ఓటింగ్‌కు అనుమతించాలని కూడా ఎన్నికల సంఘం ఇదివరకే అధికారులను ఆదేశించింది. నామినేషన్ల వ్యవహారం ముగిసినందున ఈనెల 23వ తేదీన మొదటి విడత, 27వ తేదీన రెండో విడత, 31న మూడో విడత ఎన్నికలు నిర్వహించనుంది.
Share this article :

0 comments: