వర్షంలోనూ తరగని అభిమానం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వర్షంలోనూ తరగని అభిమానం

వర్షంలోనూ తరగని అభిమానం

Written By news on Thursday, July 11, 2013 | 7/11/2013

విజయనగరం జిల్లాలో షర్మిల చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. మరో ప్రజా ప్రస్థానంలో భాగంగా ఆమె గురువారం వసంత నుంచి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులు తమ సమస్యలను షర్మిలకు వివరించారు. గజపతినగరం నియోజకవర్గంలోని తుమృగెడ్డ వలన 2 వేల ఎకరాల భూమి ముంపుకు గురి అవుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు పని చేయించుకోలేదని షర్మిల అడిగిన ప్రశ్నకు.. మరొకరు సమాధానం ఇస్తూ...ఆయన హయాంలో 8 కోట్ల 38 లక్షలు విడుదలైన మంత్రి బొత్స సత్యనారాయణ నిర్లక్ష్యం చేశారని చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత బ్రిడ్జి చేపడతారని షర్మిల వారికి హామీ ఇచ్చారు. 

ఓ వైపు వర్షం పడుతున్నా షర్మిల తన పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పిల్లలను, పెద్దలను ఆప్యాయంగా పలకరిస్తూ ఆమె ముందుకు కొనసాగుతున్నారు. మహిళలను ప్రభుత్వ పథకాల అమలు గురించి ఆరా తీస్తూ ముందుకు కదిలారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర నేటికి 206వ రోజుకు చేరింది.
Share this article :

0 comments: