కొత్తవలస నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కొత్తవలస నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

కొత్తవలస నుంచి ప్రారంభమైన షర్మిల పాదయాత్ర

Written By news on Tuesday, July 9, 2013 | 7/09/2013

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల మరోప్రజాప్రస్థానంలో భాగంగా చేపట్టిన పాదయాత్ర మంగళవారం కొత్తవలస నుంచి ప్రారంభమైంది. అద్దెనపాలెం, ఎర్రవానిపాలెం, సుంకరపాలెం,కంతకపల్లి మీదగా ఆమె పాదయాత్ర సాగుతోంది. అయితే భీమాలి వద్ద మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఈ సందర్భంగా షర్మిల ఆవిష్కరించనున్నారు. షర్మిల చేపట్టిన పాదయాత్ర మంగళవారం 204వ రోజుకు చేరింది. 

 కొత్తవలస నుంచి బయలు దేరి అద్దానపురం, ఈరవాని పాలెం, సుంకరపాలెం, కంటకాపల్లి వరకు కొనసాగించి అక్కడ మధ్యాహ్న భోజన విరామం కోసం ఆగుతారు.విరామం తరువాత భీమాళి, అలమండ గ్రామాల్లో పాదయాత్ర కొనసాగించిన తరువాత రాత్రి బస చేస్తారు. 

జిల్లాలో రెండో రోజు పర్యటించే ప్రాంతాలు
అద్దానపురం, ఈరవానిపాలెం, కంటకాపల్లి, భీమాళి, అలమండ
Share this article :

0 comments: