తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్యూసీ ఆమోదం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్యూసీ ఆమోదం

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సీడబ్యూసీ ఆమోదం

Written By news on Tuesday, July 30, 2013 | 7/30/2013

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదం తెలిపింది. మంగళవారం సమన్వయ సమావేశ కమిటీ ముగిసిన అనంతరం సీడబ్యూసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సీడబ్యూసీలో ఏకగ్రీవ తీర్మానాలు తీసుకున్నారు. మరి కాసేపట్లో అధికారికంగా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించనున్నారు.


ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అధికారిక నివాసంలో యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, ప్రతిపాదనలను యూపీఏ సంకీర్ణ సర్కారు భాగస్వామ్యపక్షాల నేతలతో పంచుకుని, వారి ఆమోదం తీసుకున్న తర్వాత ఆ వెంటనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో లాంఛనప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు. ఈ కీలక సమావేశంలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్శింహ, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు పాల్గొనున్నారు. ఈ భేటీకి సోనియాగాంధీతో పాటు పలువురు కీలక నేతలు హాజరైయ్యారు. రాహుల్ గాంధీ, అజిత్ సింగ్, సుశీల్ కుమార్ షిండే, చిదంబరం, గులాంనబీ ఆజాద్, శరద్ పవార్‌, ఫరూఖ్ అబ్దుల్లా, ముస్లింలీగ్ నేత అహ్మద్ లు ఈ భేటీకి హాజరైన వారిలో ఉన్నారు.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించడానికి యుపిఏ భాగస్వామ్య పక్షాలు ఏకగ్రీవంగా అంగీకరించాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయడానికి యుపిఏ పక్షాల నేతలు ఆమోదం తెలిపారు. కాంగ్రెస్ ప్రతిపాదనను నేతలందరూ ఆమోదించారు.
Share this article :

0 comments: