ఇంటికి తాళాలు ఏస్తామంటున్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇంటికి తాళాలు ఏస్తామంటున్నారు

ఇంటికి తాళాలు ఏస్తామంటున్నారు

Written By news on Tuesday, July 23, 2013 | 7/23/2013


పాలకొండ/వీరఘట్టం, న్యూస్‌లైన్: ‘‘రాజశేఖరరెడ్డిబాబు ఉన్నప్పుడు నుంచి బేంకు లోన్లు తీసుకుంటున్నాం. అప్పులు సరిగా కట్టాం.. మళ్లా.. మళ్లా అప్పులిచ్చారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.. పావలావడ్డీ కింద ఇచ్చిన బేంకు అప్పులు కట్టకపోతే ఇంటికి తాళాలు ఏస్తామంటన్నారు.. జైలుకు పంపిత్తామంటన్నారు’’ అంటూ స్వయంశక్తి సంఘాల మహిళలు పలువురు షర్మిల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. వీరఘట్టం మండలం తూడి గ్రామంలో స్వయంశక్తి సంఘాల మహిళలు ఆమెను కలిశారు. ‘‘పావలా వడ్డీకి అప్పు ఇత్తామన్నారు. ఆ తర్వాత వడ్డీ లేకుండానే ఇత్తామన్నారు. ఇప్పుడు ఏకంగా రూపాయి వడ్డీ వసూలు సేత్తన్నారు. ఇదేంటని ఆఫీసర్లను అడిగితే నచ్చితే అప్పు తీసుకోండి.. నేకపోతే మానీయండి.. ఇప్పటివరకు ఇవ్వవలిసిన అప్పు మట్టుక సచ్చినట్టుగా కట్టవలిసిందే’’ అంటున్నారని వాపోయారు. దీనికి స్పందించిన షర్మిల ‘‘జగనన్న ప్రభుత్వం వస్తుంది... వడ్డీలేని రుణాలు ఇస్తుంది.. ధైర్యంగా ఉండండి’’ అని సముదాయించారు. వారి చేతిలో చేయి వేసి మీకు న్యాయం చేస్తామంటూ షర్మిల భరోసా ఇచ్చారు.

రూ. 200తో వికలాంగులం ఎలా బతుకుతాం...

‘‘మా ఇంటిమనిషి.. నేను ఇద్దరం వికలాంగులమే. అతనికి రెండు కాళ్లూ సచ్చుబడిపోయాయి.. నాకు ఒక కన్ను కనిపించదు చూడమ్మా. నాకు ఎలాంటి పింఛను రావడం లేదు. మా ఆయనకు వికలాంగ పింఛను కాకుండా రూ.200 ఇత్తన్నారు. ఇద్దరం నెలంతా ఇంత తక్కువ డబ్బుతో ఎలాగ బతకతాం’’ అంటూ వీరఘట్టం మండలం వండువకు చెందిన ముంత అప్పమ్మ షర్మిల వద్ద కన్నీటి పర్యంతమయ్యారు. న్యాయం చేయాలని కోరారు. ‘అవ్వా.. మీ భార్యా భర్తలు ఇద్దరికీ మన ప్రభుత్వం వచ్చిన వెంటనే వికలాంగ పింఛను మంజూరు చేస్తాం.. మీ బతుకులు బాగు చేస్తాం’ అని షర్మిల భరోసా ఇచ్చారు.

‘ఆయకట్టు రైతులను రోడ్డున పడేశారు’

పాలకొండ, న్యూస్‌లైన్: ‘‘తోటపల్లి ప్రాజెక్టు విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రైతాంగానికి ప్రాణవాయువులాంటిది.. రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు కోసం నిధులు కేటాయించారు.. కాలువలు కూడా బాగవుతాయని ఎంతో ఆశపడ్డాం.. ఆయన చనిపోయిన తర్వాత అన్ని పనులూ పక్కన పెట్టారు. కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ పూర్తిగా పక్కన పెట్టేశారు. రైతుల్ని రోడ్డున పడేలా చేశారు. మమ్మల్ని ఆదుకోవాలంటే మళ్లీ రాజన్న కొడుకు జగనన్న ముఖ్యమంత్రి కావాల్సిందే’’ అంటూ తోటపల్లి ఆయకట్టు రైతులు.. షర్మిలతో అన్నారు. పాలకొండ మండలం నవగాం జంక్షన్ వద్ద తోటపల్లి ఆయకట్టు రైతులు షర్మిలతో మాట్లాడారు. ‘‘ఎం.సింగుపురంలో 2006లో నాన్నగారు పర్యటించినప్పుడు తోటపల్లి పూర్తి చేస్తామని హామీ చ్చారు. కాని ఇప్పటి కిరణ్ ప్రభుత్వం పూర్తిగా ప్రాజెక్టును పక్కనపెట్టేసింది’’ అంటూ నిర్వేదం చెందారు. షర్మిల బదులిస్తూ ‘‘తోటపల్లి ప్రాజెక్టు, కుడి, ఎడమ కాలువల ఆధునీకరణ జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే పూర్తవుతుంది’’ అని భరోసా ఇచ్చారు.
Share this article :

0 comments: