ఆరోగ్యం అంతకంతకూ క్షీణిస్తూ, ప్రమాదకరంగా తయారైనా మొక్కవోని పట్టుదలతో వైఎస్ జగన్ నిమ్స్ ఆస్పత్రిలో కొనసాగిస్తున్న దీక్ష ఏడో రోజూ కొనసాగుతోంది. వెంటనే ఫ్లూయిడ్స్ ఎక్కించకపోతే చాలా ప్రమాదమని నిమ్స్ డాక్టర్లు చెప్తున్నారు. ఈ రోజు ఉదయం డాక్టర్లు జగన్పై హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. నిల్చుంటే బిపి డౌనై పడిపోయే స్థితిలో జగన్ వున్నారని, షుగర్ లెవెల్స్ కూడా బాగా డౌన్ అయ్యాయని చెప్పారు. అంతేగాక కిడ్నీ పారామీటర్స్ కూడా ఆందోళనకర స్థాయిలో డౌన్ అవుతున్నాయని వారు చెప్పారు.
డాక్టర్ శేషగిరి నేతృత్వంలో వైద్యుల బృందం వైఎస్ జగన్కి వైద్య పరీక్షలు నిర్వహించింది. అయితే జగన్ వైద్యాన్ని నిరాకరిస్తున్నారని, తన ప్రాణం కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దీక్షను ఆపేది లేదని ఆయన చెప్పినట్లు వైద్యులు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి జగన్ ఆరోగ్య స్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వారు చెప్పారు. మరోవైపు క్షీణిస్తున్న జగన్ ఆరోగ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఎంతో మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు నిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ఆస్పత్రి వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు
డాక్టర్ శేషగిరి నేతృత్వంలో వైద్యుల బృందం వైఎస్ జగన్కి వైద్య పరీక్షలు నిర్వహించింది. అయితే జగన్ వైద్యాన్ని నిరాకరిస్తున్నారని, తన ప్రాణం కన్నా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, దీక్షను ఆపేది లేదని ఆయన చెప్పినట్లు వైద్యులు వెల్లడించారు. మధ్యాహ్నం 3 గంటలకు మరోసారి జగన్ ఆరోగ్య స్థితిపై హెల్త్ బులెటిన్ విడుదల చేస్తామని వారు చెప్పారు. మరోవైపు క్షీణిస్తున్న జగన్ ఆరోగ్యంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఎంతో మంది అభిమానులు, పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు నిమ్స్ ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు. మరోవైపు ఆస్పత్రి వద్ద పోలీసులు భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు
0 comments:
Post a Comment