వైఎస్సార్జిల్లా: సమైక్యాంధ్రకు మద్దతుగా రాజంపేట ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసులు భగ్నం చేశారు. అమరనాథ్రెడ్డికి ఆరోగ్యం క్షీణించడంతో ఆయన దీక్షను భగ్నం చేసి బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఆయనకు షుగర్ లెవిల్స్ భారీగా పడిపోయి, బీపీ పెరిగిపోవడంతో దీక్షను భగ్నం చేసి రాజంపేట ఆస్పత్రికి తరలించారు. కాగా, ఆస్పత్రిలో కూడా దీక్షను కొనసాగిస్తానని అమర్నాథ్ రెడ్డి తెలిపారు..
ఈ రోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి కారణం సోనియా గాంధీయేనని కారణంటూ ఆయన ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న ఆలోచనతోనే విభజనకు సోనియా మొగ్గు చూపారని ఆయన దుయ్యబట్టారు.
ఈ రోజు రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి కారణం సోనియా గాంధీయేనని కారణంటూ ఆయన ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. తన కుమారుడు రాహుల్ గాంధీని ప్రధానిని చేయాలన్న ఆలోచనతోనే విభజనకు సోనియా మొగ్గు చూపారని ఆయన దుయ్యబట్టారు.
0 comments:
Post a Comment