దీక్షలు భగ్నం చేసినా ప్రజలమధ్యనే ఉంటాం:విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » దీక్షలు భగ్నం చేసినా ప్రజలమధ్యనే ఉంటాం:విజయమ్మ

దీక్షలు భగ్నం చేసినా ప్రజలమధ్యనే ఉంటాం:విజయమ్మ

Written By news on Saturday, August 31, 2013 | 8/31/2013

దీక్షలు భగ్నం చేసినా ప్రజలమధ్యనే ఉంటాం:విజయమ్మ
హైదరాబాద్: ప్రభుత్వం తమ దీక్షలను భగ్నం చేసినా తాము ప్రజల మధ్యనే ఉంటామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చెప్పారు.  వైఎస్ జగన్ ప్రజలందరికీ అండగా, తోడుగా ఉంటారన్నారు. ఇప్పటికీ జగన్ నిరసంగానే ఉన్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం దీక్షలు మాత్రమే భగ్నం చేయగలిగిందన్నారు. తాము ప్రజల వెంటే ఉంటామని చెప్పారు.

సమన్యాయం చేయకపోతే రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని ఆమె డిమాండ్ చేశారు. సెప్టెంబరు 2న తిరుపతి నుంచి షర్మిల బస్సుయాత్ర ప్రారంభించనున్నట్లు తెలిపారు.  రాష్ట్రం అగ్నిగుండంగా మండుతోందని, స్కూళ్లు, కాలేజీలు పనిచేయడం లేదని చెప్పారు. ప్రజలంతా రోడ్లపైనే ఉన్నారన్నారు.

తెలంగాణ ప్రాంతానికి దివంగత మహానేత డాక్టర్  వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన అభివృద్ధి ఎంతో ఉందని చెప్పారు. ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అనేది వైఎస్‌ఆర్‌సీపీకి లేదని స్పష్టం చేశారు.
Share this article :

0 comments: