ముస్లింల గుండెల్లో వైఎస్: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ముస్లింల గుండెల్లో వైఎస్: విజయమ్మ

ముస్లింల గుండెల్లో వైఎస్: విజయమ్మ

Written By news on Friday, August 2, 2013 | 8/02/2013

ముస్లింల గుండెల్లో వైఎస్: విజయమ్మ
హైదరాబాద్ : ముస్లిం సోదరుల అభివృద్ధి కోసం ఎంతగానో పాటుపడిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి.. వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారు. గురువారమిక్కడ కింగ్‌కోఠి ఈడెన్ గార్డెన్‌లో పార్టీ మైనార్టీ విభాగం కన్వీనర్ హెచ్.ఎ.రెహమాన్ ఆధ్వర్యంలో ఇచ్చిన ఇఫ్తార్ విందుకు విజయమ్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ముస్లింల సంక్షేమానికి వైఎస్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించారని గుర్తుచేశారు. ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ... తెలంగాణ భవిష్యత్తు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ఇఫ్తార్ విందులో పార్టీ నేతలు గట్టు రామచంద్రరావు, జనక్‌ప్రసాద్, రోజా, శోభానాగిరెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డి, విజయారెడ్డి, ఆదం విజయ్‌కుమార్, వెల్లాల రామ్మోహన్, మత పెద్దలు అలీఖాద్రీ, హఫీజ్ తదితరులు పాల్గొన్నారు. విజయమ్మ రాకతో పార్టీ కార్యకర్తలు, అభిమానులతో ఈడెన్ గార్డెన్ కిటకిటలాడింది.
Share this article :

0 comments: