రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ అనుసరించిన ఏకపక్ష, నిరంకుశ తీరుకు నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం జిల్లాలో బస్సుయాత్ర చేయాలని నిర్ణయించింది. ఈ బస్సుయాత్ర ఈ నెల 22న పాయకరావుపేటలో ఆరంభమవుతుంది. 28వ తేదీ వరకూ కొనసాగే ఈ బస్సుయాత్ర మొత్తం ఏడు నియోజకవర్గాల్లో కొనసాగుతుందని పార్టీ నాయకులు గురువారం విశాఖలో తెలిపారు. బస్సు యాత్రకు సంబంధించి గురువారంనాడు విశాఖపట్నంలో పార్టీ నాయకులు సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు జ్యోతుల నెహ్రూ, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
http://www.ysrcongress.com/news/news_updates/ysrcp-bus-tour-from-22nd-august-in-vizag-dist.html
http://www.ysrcongress.com/news/news_updates/ysrcp-bus-tour-from-22nd-august-in-vizag-dist.html
0 comments:
Post a Comment