జగన్ ను తరలిస్తున్న విషయం తెలిసిన ఆయన తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆయన భార్య వైఎస్ భారతి, బావ అనిల్ కుమార్ తదితరులు నిమ్స్ వద్దకు శుక్రవారం రాత్రి వెళ్లారు. కానీ, అధికారులు అనుమతించకపోవడంతో దూరం నుంచే ఆయనను చూసి, వెనుదిరగాల్సి వచ్చింది. జగన్ నిన్నటికంటే బాగా నీరసంగా కనిపించారని ఈ సందర్భంగా వైఎస్ భారతి విలేకరులతో అన్నారు. కాగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాకులోని 130 నెంబరు గది కేటాయించారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు నిమ్స్ వద్దకు చేరుకున్నారు.
Home »
» జగన్ కుటుంబ సభ్యులకు నిమ్స్ లో అనుమతి నిరాకరణ
జగన్ కుటుంబ సభ్యులకు నిమ్స్ లో అనుమతి నిరాకరణ
Written By news on Saturday, August 31, 2013 | 8/31/2013
జగన్ ను తరలిస్తున్న విషయం తెలిసిన ఆయన తల్లి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆయన భార్య వైఎస్ భారతి, బావ అనిల్ కుమార్ తదితరులు నిమ్స్ వద్దకు శుక్రవారం రాత్రి వెళ్లారు. కానీ, అధికారులు అనుమతించకపోవడంతో దూరం నుంచే ఆయనను చూసి, వెనుదిరగాల్సి వచ్చింది. జగన్ నిన్నటికంటే బాగా నీరసంగా కనిపించారని ఈ సందర్భంగా వైఎస్ భారతి విలేకరులతో అన్నారు. కాగా, వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నిమ్స్ ఎమర్జెన్సీ బ్లాకులోని 130 నెంబరు గది కేటాయించారు. ఆయనను చూసేందుకు భారీ సంఖ్యలో అభిమానులు నిమ్స్ వద్దకు చేరుకున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment