కడప(వైఎస్ఆర్ జిల్లా): సీమాంధ్రకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో చిత్తశుద్ధితో ఉద్యమం చేస్తున్నది ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయేనని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అనుసరించే వైఖరికి నిరసనగా ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడిలను పరామర్శించేందుకు ఈరోజు ఆయన ఇక్కడకు వచ్చారు. ఆరు రోజులుగా దీక్ష చేస్తున్నవారిని పెద్దిరెడ్డి పరామర్శించారు.
ఈ సందర్బంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ ఉద్యమాన్ని పక్కదారి పట్టించేదుకు కాంగ్రెస్, తెలుగుదేశంవారు నాటకాలాడుతున్నారని విమర్శించారు. ఆ పార్టీల ఎమ్మెల్యేలు ఇచ్చిన రాజీనామాలు స్పీకర్ ఫార్మేట్ లో లేవన్నారు.
source:sakshi
0 comments:
Post a Comment