Home »
» చంచల్గూడ జైలు వద్ద మహిళల నిరసన
చంచల్గూడ జైలు వద్ద మహిళల నిరసన
హైదరాబాద్: అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప లోక్ సభ సభ్యుడు జగన్మోహన రెడ్డికి రాఖీ కట్టేందుకు చంచల్గూడ జైలు వద్ద మహిళలు బారులు తీరారు. పోలీసులు అనుమతించకపోవడంతో వారు నిరసన తెలుపుతున్నారు. తమకు అనుమతి ఇచ్చేవరకు కదిలేదిలేదని అక్కడే భీష్కించుకు కూర్చున్నారు. కనీసం తమలో ఒక్కరికైనా అనుమతి ఇవ్వాలంటూ వాళ్లు ప్రాధేయపడ్డారు. ఫలితంలేదు. దాంతో వారు జైలు ముందు ధర్నా చేస్తున్నారు.జగనన్నకు రాఖీ కడతామని తాము రెండు రోజుల ముందే జైలు అధికారులకు చెప్పినట్లు వారు తెలిపారు. తమని అడ్డుకుంటున్న పోలీసులపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు మహిళలు జైలు గేటు ఎదురుగా జగన్ ఫోటోకు రాఖీ కట్టారు. మరికొందరుమహిళలు జగన్ ను కలవడానికి వచ్చిన ఆయన సతీమణి భారతి చేతికి, సోదరి షర్మిల చేతికి రాఖీలు కట్టారు. జగనన్నకే రాఖీ కట్టినట్లు సంబరపడిపోయారు. పోలీసుల వైఖరి మారాలంటూ, వారికి కూడా రాఖీలు కట్టారు.
0 comments:
Post a Comment