జగన్ అభిమానులపై ఎస్ఐ సైదులు దౌర్జన్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ అభిమానులపై ఎస్ఐ సైదులు దౌర్జన్యం

జగన్ అభిమానులపై ఎస్ఐ సైదులు దౌర్జన్యం

Written By news on Friday, August 30, 2013 | 8/30/2013

హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డి అభిమానులపై కాచిగూడ ఎస్ఐ సైదులు దౌర్జన్యానికి పాల్పడ్డాడు.  ఉస్మానియా ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న జగన్ ను చూసేందుకు పలువురు అభిమానులు అక్కడికి చేరుకోవడంతో సైదులు వారిపై విరుచుకుపడ్డాడు. ఈ దాడిలో కొంతమంది వైఎస్సార్ సీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. సైదులు నిర్వాకాన్ని వైఎస్సార్ సీపీ ఖండించింది. ఇలా దాడికి దిగడం సబబు కాదని వైఎస్సార్ సీపీ నేతలు మండిపడ్డారు. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేస్తామని వైఎస్సార్ సీపీ తెలిపింది.
 
మూడు ప్రాంతాలకూ సమన్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచాలంటూ ఉస్మానియా ఆస్పత్రిలో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మద్దతు తెలిపేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు అక్కడికి చేరుకున్నారు. దీంతో పోలీసులు వారిపై విరుచుకుపడ్డారు. ఎస్ఐ సైదులు అభిమానులను తీవ్రంగా గాయపరచడాన్ని వైఎస్సార్ సీపీ ఖండించింది.
Share this article :

0 comments: