వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించినా, ఆయనను చూసేందుకు తల్లి వైఎస్ విజయమ్మ, భార్య వైఎస్ భారతిలకు అనుమతి లభించలేదు. అనుమతి లేనిదే తాము ఏమీ చేయలేమని, గేటు బయటే పోలీసులు కొంతసేపు అడ్డుకున్నారు. తర్వాత ఇద్దరిని మాత్రం వాహనంతో లోనికి అనుమతిస్తామని చెప్పడంతో వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతి మాత్రం వాహనంలో ఉండి, లోనికి వెళ్లారు.
కానీ అక్కడ మరోసారి పోలీసులు వారిని అడ్డుకున్నారు. కోర్టు అనుమతి లేకుండా ఆస్పత్రిలోకి ఎవరినీ పంపే అవకాశం లేదని వారికి పోలీసులు స్పష్టం చేశారు. చంచల్ గూడ జైలు అధికారుల అనుమతి లేనిదే కుటుంబ సభ్యులను ఆస్పత్రిలోనికి పంపలేమని తెలిపారు. చివరకు వైద్యులను బయటకు తీసుకొచ్చి, విజయమ్మ, భారతిలతో వారిని మాట్లాడించారు.
షుగర్ లెవెల్స్ 49కి పడిపోవడం, వైఎస్ జగన్ ఆరోగ్యం బాగా విషమించినట్లు వార్తలు రావడంతో.. అవసరమైతే ఫ్లూయిడ్స్ ఎక్కించి దీక్షను భగ్నం చేయాలని కూడా వైద్యులకు వైఎస్ విజయమ్మ సూచించినట్లు తెలిసింది. గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం శుక్రవారం సాయంత్రం విషమించినట్టు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వైఎస్ జగన్ ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.
0 comments:
Post a Comment