వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ చేపట్టిన దీక్ష తెలంగాణకు వ్యతిరేకం కాదని, అన్ని ప్రాంతాలకు సమన్యాయం జరగడానికేనని స్పష్టం చేశారు. విజయమ్మ దీక్ష తెలంగాణ ప్రజలకు, దళితులకూ వర్తిస్తుందన్నారు. విభజన ప్రకటనతో సీమాంధ్రులు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు.ప్రస్తుతం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు, జేఏసీ నాయకులు మాట్లాడుతున్న భాష దారుణంగా ఉందన్నారు. ‘తెలంగాణలో సీమాంధ్రులకు రక్షణ కల్పించడం మా బాధ్యత అంటున్నారు. ఇంతకు రక్షణ కల్పించడానికి వారెవరు?’ అని ప్రశ్నించారు.
విభజన జరిగితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అమలు కాకుండా పోతాయనే భయం కలుగుతుందన్నారు. తెలంగాణ వచ్చినా, రాకున్నా దళితులకు కావాల్సింది సంక్షేమ పథకాలేనని చెప్పారు. తెలంగాణ పేరుతో దళితుల అభివృద్ధిని అడ్డుకుంటామంటే సహించే పరిస్థితిలేదన్నారు. దొరలు, భూస్వామ్యుల పెత్తందారి వ్యవస్థను తాము ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోమని సూర్యప్రకాష్ స్పష్టం చేశారు.
0 comments:
Post a Comment