ఉత్తరాంధ్రకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి తమ్మినేని సీతారాం గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు అనుకూలం అంటూ తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు కేంద్రానికి లేఖ రాయడాన్ని తమ్మినేని సీతారాం తప్పపట్టారు. విభజన విషయంలో బాబు కీలకపాత్ర పోషించడంపై సీతారాం నిప్పులు చెరిగారు.
బాబు వైఖరికి నిరసనగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావాన్ని ప్రకటించారు. కాగా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న పలువురు నేతలు ఇప్పటికే ఆ పార్టీని విడుతుండటంతో చంద్రబాబుకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది.
బాబు వైఖరికి నిరసనగా ఆయన ఆ పార్టీకి రాజీనామా చేశారు. విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేపట్టిన దీక్షకు ఆయన సంఘీభావాన్ని ప్రకటించారు. కాగా ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న పలువురు నేతలు ఇప్పటికే ఆ పార్టీని విడుతుండటంతో చంద్రబాబుకు దిక్కు తోచని పరిస్థితి నెలకొంది.
0 comments:
Post a Comment