రాష్ట్ర విభజనపై నిరంకుశంగా నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ తీరుకు నిరసనగా నాలుగు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన రెడ్డికి చంచల్ గూడ జైల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల వివరాలను బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ వెల్లడించారు.
బుధవారం సాయంత్ర వైఎస్ జగన్ కు ఆరు రకాలు వైద్య పరీక్షలు నిర్వహించామని వైద్యులు తెలిపారు. నాలుగు రోజులుగా ఆహారం తీసుకోకపోవడంతో వైఎస్ జగన్ బాగా నీరసించినట్టు వైద్యులు హెల్త్ బులెటిన్ లో తెలిపారు. వైఎస్ జగన్ బీపీ, షుగర్ సాధారణ స్థాయిలో ఉన్నాయని వైద్యులు తెలిపారు. మరో రెండు వైద్య పరీక్షల వివరాలు గురువారం తెలుస్తాయని మీడియాకు వైద్యులు తెలిపారు.
0 comments:
Post a Comment