ఉస్మానియా ఆస్పత్రిలో దీక్ష చేస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలువడానికి ఆయన సతీమణి వైఎస్ భారతీ చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. వైఎస్ జగన్ ను కలువడానికి అనుమతి ఇవ్వాలని వైఎస్ భారతి పోలీసులకు విజ్క్షప్తి చేశారు. అయినా వైఎస్ భారతికి పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె వెనుదిరిగి వెళ్లారు.
అంతకు ముందు వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నందున ఆయనకు సహాయంగా ఉండటానికి అనుమతించాల్సిందని సీబీఐ కోర్టులో మోమోను వ్యక్తిగతంగా దాఖలు చేశారు. వైఎస్ భారతీ దాఖలు చేసిన మోమోను పరిగణనలోకి తీసుకుని విచారణను శనివారానికి వాయిదా వేశారు.
0 comments:
Post a Comment