అయితే జగన్ అందుకు సమ్మతించలేదు. బాగా నీరసంగా ఉన్నప్పటికీ ఆయన తనకు ఎలాంటి ఆహారం వద్దని తిరస్కరించినట్లు జైలు అధికారుల ద్వారా తెలిసింది. తనను బలవంతం చేయవద్దని ఆయన అధికారులను కోరినట్లు చెబుతున్నారు. జైలు డాక్టర్లు, జైలు సూపరిటెండెంట్లో చర్చలు జరిపిన అనంతరం జగన్ రక్త పరీక్ష నివేదికలతో జైళ్ల శాఖ ఐజీ సునీల్కుమార్ వద్దకు బయలుదేరారు.
ఆహారం తీసుకోవడానికి నిరాకరిస్తున్న జగన్ చేత దీక్షను ఎలా విరమింప జేయాలనే విషయమై ఐజీ వద్ద చర్చలు జరిగాక ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జగన్ ఆరోగ్యాన్ని తదుపరి జైలులో ఉన్న వైద్యులే పర్యవేక్షిస్తారా లేక సౌకర్యాలున్న ఆసుపత్రికి తరలించాలా అనేది కూడా ఇంకా నిర్ణయం తీసుకోలేదు
0 comments:
Post a Comment