హైదరాబాద్ :
రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉస్మానియా ఆస్పత్రిలో కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సహాయంగా ఆస్పత్రిలో ఉండేందుకు అనుమతి ఇవ్వమని వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతీలు చేసిన విజ్క్షప్తిని నాంపల్లి సీబీఐ కోర్టు నిరాకరించింది.
అయితే వైఎస్ జగన్ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న దృష్ట్యా తమకు అనుమతి ఇవ్వాల్సిందిగా వ్యక్తిగతంగా మోమోను వైఎస్ భారతి సీబీఐ కోర్టులో దాఖలు చేశారు. వైఎస్ భారతీ చేసిన విజ్క్షప్తిని పరిగణనలోకి తీసుకుని విచారణను సీబీఐ కోర్టు రేపటికి వాయిదా వేసింది.
0 comments:
Post a Comment