రాష్ట్ర విభజనపై చంద్రబాబు మౌనానికి అర్ధమేమిటని జూపూడి ప్రశ్నించారు. విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రాబాబు లేఖతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సివచ్చిందని వైఎస్ఆర కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు.
ఆయన కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్తో కలసి చంద్రబాబు నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన హితవు పలికారు. సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడం వదిలేసి.. రాజధాని గురించి రగడ చేయడం వెనుకు అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
0 comments:
Post a Comment