కాంగ్రెస్ మంటలకు బాబు ఆజ్యం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కాంగ్రెస్ మంటలకు బాబు ఆజ్యం

కాంగ్రెస్ మంటలకు బాబు ఆజ్యం

Written By news on Thursday, August 1, 2013 | 8/01/2013

కాంగ్రెస్ మంటలకు బాబు ఆజ్యం: జూపూడి
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ పెట్టిన మంటలకు చంద్రబాబు నాయుడు ఆజ్యం పోస్తున్నారని వైఎస్సార్‌సీపీ నేతలు విమర్శించారు. చంద్రబాబు నాయుడు, ఆ పార్టీ నేతలు  రాష్ట్రం గురించి  మాట్లాకుండా.. రాజధాని గురించి మాత్రమే మాట్లాడుతున్నారని జూపూడి ప్రభాకర రావు, భూమా నాగిరెడ్డి విమర్శించారు.  రాష్ట్ర విభజనపై కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు నాయుడు డ్రామాలాడుతున్నారని వారు  మండిపడ్డారు. గురువారం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేతలు ఈ సందర్భంగా బాబును దుయ్యబట్టారు.
 
 రాష్ట్ర విభజనపై చంద్రబాబు మౌనానికి అర్ధమేమిటని  జూపూడి ప్రశ్నించారు.  విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంలో చంద్రబాబు పాత్ర కూడా ఉందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ పెద్దలతో చంద్రబాబు ఏం మాట్లాడుతున్నారో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. చంద్రాబాబు లేఖతోనే తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వాల్సివచ్చిందని వైఎస్‌ఆర కాంగ్రెస్ పార్టీ నేత భూమా నాగిరెడ్డి అన్నారు.
ఆయన  కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌తో కలసి చంద్రబాబు నాటకాలాడుతున్నారని దుయ్యబట్టారు. అందరితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని ఆయన హితవు పలికారు. సమైక్య రాష్ట్రం గురించి మాట్లాడం వదిలేసి.. రాజధాని గురించి రగడ చేయడం వెనుకు అర్ధం ఏమిటని ఆయన ప్రశ్నించారు.
Share this article :

0 comments: