మాట తప్పడం బాబు నైజం: షర్మిల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాట తప్పడం బాబు నైజం: షర్మిల

మాట తప్పడం బాబు నైజం: షర్మిల

Written By news on Saturday, August 3, 2013 | 8/03/2013

మరో ప్రజాప్రస్థానం 02-08-2013
ఆయన్ను నమ్మితే మన గొయ్యి మనం తవ్వుకున్నట్టే
  మరో ప్రజాప్రస్థానంలో షర్మిల మండిపాటు
  రాష్ట్రంలో బాబు పాలన ఓ చీకటి అధ్యాయం

  అడ్డగోలు కరెంటు చార్జీలతో రైతులను వేధించారు.. అన్నదాతలను జైల్లో పెట్టారు
  ఆ అవమానాలు తట్టుకోలేక 3 వేల మంది ఆత్మహత్య చేసుకున్నారు

 
 మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి:‘‘చంద్రబాబు 1999 ఎన్నికలకు ముందు కొన్ని వాగ్దానాలు చేశారు. అధికారంలోకి వస్తే మహిళలకు బంగారు మంగళ సూత్రాలు ఇస్తానని, ఆడపిల్లలు పుడితే వారికి రూ.5 వేలు, స్కూలుకు వెళ్లేందుకు సైకిల్, వాళ్లు చదివినంత వరకు పెద్ద చదువులు చదివిస్తానని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మరిచిపోయారు. అడ్డగోలు కరెంటు చార్జీల వసూళ్ల పేరుతో సంసారాలను కూల్చారు. రైతులను పట్టుకొచ్చి జైలుకు పంపారు. ఇంట్లో మగవాళ్లు లేకుంటే ఆడవాళ్లను తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్లలో నిలబెట్టారు.
 
 ఈ అవమానం భరించలేక మూడు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనకు అధికారం కట్టబెడితే రైతు రుణాలను మాఫీ చేస్తానని చెబుతున్నాడు. చంద్రబాబును నమ్ముకుంటే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్టు’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల నిప్పులు చెరిగారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న ప్రతిపక్షనాయకుడు చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. 20 కిలోమీటర్లకు పైగా సాగిన ఈ పాదయాత్రలో పలు గ్రామాల ప్రజలు షర్మిలను కలిశారు. వారి సమస్యలను చెప్పుకున్నారు. ధైర్యంగా ఉండాలంటూ వారికి షర్మిల భరోసానిచ్చారు. ఈ సందర్భంగా పలుచోట్ల షర్మిల ప్రజలతో ఏమన్నారో ఆమె మాటల్లోనే..
మరో ప్రజాప్రస్థానం 02-08-2013 
 వైఎస్ ఓ తండ్రిలా పాలించారు..
 ‘‘వైఎస్సార్ కంటే ముందు, ఆయన తరువాత చాలామంది ముఖ్యమంత్రులు పనిచేశారు. ముందు తొమ్మిదేళ్లు చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా పని చేశారు. ఈ మూడేళ్ల నుంచి కిరణ్‌కుమార్‌రెడ్డి పాలన సాగింది. మధ్యలో వైఎస్సార్ సువర్ణపాలన సాగింది. ఒక్క వైఎస్సార్ మాత్రమే తండ్రి స్థానంలో నిలబడి ప్రజల గురించి ఆలోచించారు. సుపరిపాలన అందించారు. ఎందుకంటే రాజశేఖరరెడ్డి ప్రజల నుంచి పుట్టిన నాయకుడు. ఆయన రెక్కల కష్టమ్మీద అధికారంలోకి వచ్చిన ఈ పాలకులు ఈరోజు వైఎస్సార్ సంక్షేమ పథకాలకు తూట్లు పొడుస్తున్నారు. చంద్రబాబు హయాంలో 16 లక్షలు మాత్రమే ఉన్న వృద్ధాప్య, వితంతు పింఛన్లను వైఎస్సార్ 71 లక్షలకు పెంచారు. అంటే 55 లక్షల మందికి అదనంగా వైఎస్సార్ పింఛన్లు ఇచ్చారు. పెన్షన్లే కాదు.. అరోగ్యశ్రీ, 108, 104. పావలా వడ్డీ రుణాలు, ఉచిత విద్యుత్తు, పక్కా ఇళ్లు ఇలా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి చూపెట్టారు. అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ఒక్క రూపాయి కూడా చార్జీలు పెంచని రికార్డు ముఖ్యమంత్రి వైఎస్సార్. కానీ మన దురదృష్టం కొద్దీ ఆ కాలం పోయింది. ఇప్పుడు మన ఖర్మకొద్ది కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు.
 
 ఇది బాబు పాలనకు కొనసాగింపే..
 చంద్రబాబు నాయుడు పాలనంతా ఒక చీకటి అధ్యాయం.. ప్రజల నెత్తురు పిండుకొని తాగారు. రాబందుల్లా ప్రజలను పీడించారు. దానికి కొనసాగింపుగానే ఇప్పుడు కిరణ్ ప్రభుత్వం నడుస్తోంది. వైఎస్సార్ ఇచ్చిన పింఛన్లకు ఇవ్వాళ ఈ పాలకులు కోత పెడుతున్నారు. పావలా వడ్డీ రుణాలను ఏనాడో అటకెక్కించారు. పేరుకు వడ్డీ లేని రుణాలని గొప్పలు చెప్తున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ప్రచారం చేసుకుంటున్నారు. కానీ పల్లెల్లో ఏ మహిళలను పలకరించినా ఏ ఒక్కరికి కూడా వడ్డీ లేని రుణాలు అందటం లేదని చెప్తున్నారు. రూ.2, రూ.3 వడ్డీ తీసుకుంటున్నారని చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు ఎవరికి ఇచ్చిందో అర్థం కావడం లేదు. ఇప్పటికే ఎరువుల ధరలు 300 శాతం నుంచి 800 శాతానికి పెంచారు. ఆర్టీసీ చార్జీలు 3 సార్లు పెంచారు. రూ.305 ఉన్న వంటగ్యాస్ ధర రూ.440 చేశారు. అదీ సబ్సిడీ ఉంటే.. సబ్సిడీ లేకుంటే రూ.1000 ఒక్క గ్యాస్ సిలిండర్‌కు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. రిజిస్ట్రేషన్ చార్జీలు, వ్యాట్, కరెంటు చార్జీలు ప్రతి ఒక్కటీ పెంచేశారు’’
 మరో ప్రజాప్రస్థానం 02-08-2013
 20.1 కి.మీ. పాదయాత్ర..
 శుక్రవారం 228వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం రంగోయ్ జంక్షన్ నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి మకరాజువాక, హరిపురం, మందస, కొత్తపల్లి, పాలవలస, కొర్లాం, లక్కవరం, బుర్గాం గ్రామాల మీదుగా సాగింది. బుర్గాం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు షర్మిల చేరుకున్నారు. మొత్తం 20.1 కిలోమీటర్లు నడిచారు. షర్మిల వెంట నడిచిన వారిలో పార్టీ నేతలు వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు ధర్మాన కృష్ణదాసు, మేకపాటి చంద్రశేఖరరెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్ ధర్మాన పద్మప్రియ, తాజా మాజీ ఎమ్మెల్యేలు సుజయ కృష్ణారంగారావు, పిరియా సాయిరాజు, మాజీ ఎంపీ డాక్టర్ కణితి విశ్వనాథం, మాజీ ఎమ్మెల్యేలు బగ్గు లక్ష్మణరావు, ముదునూరి ప్రసాదరాజు, కుంభ రవిబాబు, పలాస కో ఆర్డినేటర్ వజ్జె బాబూరావు, వివిధ నియోజకవర్గాల కో ఆర్డినేటర్లు కల్మట వెంకటరమణ, వరుధు కళ్యాణి, గొర్లె కిరణ్, దువ్వాడ శ్రీనివాసు, కిల్లి రామ్మోహన్‌రావు, వైవీ సూర్యనారాయణ, పీఎంజే బాబు, బొడ్డేపల్లి మాధురి, నాయకులు తిప్పల నాగిరెడ్డి, సిద్ధమూర్తి నారాయణరెడ్డి, కందుల రంగారెడ్డి, కొయ్య ప్రసాదరెడ్డి, కిలపర్తి జానకి, స్థానిక నాయకులు దుప్పల రవీంద్ర, హన్మంతు కిరణ్‌కుమార్, బొడ్డేపల్లి పద్మజ, ధవళ వెంకటగిరిబాబు ఉన్నారు. ప్రతిరోజు షర్మిలతో నడుస్తున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, ఆర్కే, కాపు భారతి, డాక్టర్ హరికృష్ణ, అందూరి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
 
 వడివడిగా ‘విజయ ప్రస్థానం’ పనులు
 ‘విజయ ప్రస్థానం’ స్తూపం నిర్మాణం ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. పదమూడున్నర అడుగుల స్థలంలో చేపట్టిన ఈ నిర్మాణంలో ఐదడుగుల పెడస్టల్‌పై పది అడుగుల వైఎస్సార్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. విగ్రహానికి రెండు వైపులా రెండు ఆర్చ్‌లను పదిహేను అడుగుల ఎత్తులో నిర్మించారు. పెడస్టల్‌పై షర్మిల ఫొటోతో ఉన్న గ్రానైట్ పలకను అమర్చనున్నారు. ఈ రెండు ఆర్చ్‌ల మధ్య వైఎస్సార్‌సీపీ గుర్తు ఉండేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఆర్చ్, ప్రవేశ ద్వారం, గ్రానైట్ ఫ్లోరింగ్ పనులు పూర్తి చేశారు. శనివారం రాత్రి నాటికి విజయప్రస్థానం స్తూపం పనులు పూర్తి అవుతాయని వైఎస్సార్‌సీపీ కార్యక్రమాల రాష్ట్ర కో-ఆర్డినేటర్ తలశిల రఘురాం చెప్పారు. బహిరంగ సభ ఏర్పాట్లు కూడా చకచకా సాగుతున్నాయి. లక్షల సంఖ్యలో వచ్చే జనం ఇబ్బంది పడకుండా పక్కా ఏర్పాట్లు చేస్తున్నారు.
Share this article :

0 comments: