జగన్ ఆరోగ్యం విషయమై భయపడ్డాం:వైఎస్ భారతి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ ఆరోగ్యం విషయమై భయపడ్డాం:వైఎస్ భారతి

జగన్ ఆరోగ్యం విషయమై భయపడ్డాం:వైఎస్ భారతి

Written By news on Saturday, August 31, 2013 | 8/31/2013

జగన్ ఆరోగ్యం విషయమై భయపడ్డాం:వైఎస్ భారతి
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి ఆరోగ్యం విషయంలో నిన్న, ఈరోజు మధ్యాహ్నం తాము భయపడినట్లు ఆయన సతీమణి వైఎస్ భారతి చెప్పారు. నిమ్స్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. తన తండ్రి కూడా డాక్టరేనని చెప్పారు. దీక్ష విరమించనని తాము ఎంత చెప్పినా జగన్ విరమించలేదన్నారు. ఆ  తరువాత జగన్ ఆరోగ్యం విషయంలో తాము చాలా ఆందోళన చెందినట్లు తెలిపారు.  కోర్టు ఆర్డర్ తీసుకువచ్చి చూపించి వైద్యులు బలవంతంగా జగన్ ఆమరణదీక్షను భగ్నం చేసినట్లు తెలిపారు. పల్స్ రేటు పడిపోయినా, కిడ్నీలు దెబ్బతింటాయని చెప్పినా భయంలేదా అని డాక్టర్లు జగన్ ను అడిగినట్లు చెప్పారు.  'స్పందించవలసినప్పుడు స్పందిచాలి గదా' అని జగన్ అన్నట్లు ఆమె తెలిపారు. 8 నుంచి పది మంది డాక్టర్లు వచ్చి జగన్ కు బలవంతంగా ఐవి ఫ్లూయిడ్స్ ఎక్కించినట్లు చెప్పారు. తన ముందు జగన్ కు మూడు  సెలైన్ బాటిళ్లు ఎక్కించినట్లు తెలిపారు.  ఏడు రోజుల నుంచి ఆహారం తీసుకోనందున ఇప్పుడు వెంటనే ఆహారం పెట్టరని చెప్పారు. డాక్టర్లు అందరూ మంచివారేనని చెప్పారు. ఎక్కడైనా డాక్టర్లు పేషెట్స్ ని బాగానే చూస్తారన్నారు.

జగన్ తన వద్ద ఎటువంటి రాజకీయాలు మాట్లాడలేదని భారతి చెప్పారు. ఎల్లుండి షర్మిలమ్మ బస్సు యాత్ర మొదలు పెడతారన్నారు. ప్రస్తుతం జగన్ కు రక్త పరీక్షలు చేస్తున్నారు
Share this article :

0 comments: