సీమాంధ్రలో ప్రజాగ్రహం ఈ స్థాయిలో ఉందని ఏ పార్టీ ఊహించలేదని విజయమ్మ అన్నారు. రాష్ట్రాన్ని తానే అభివృద్ధి చేశానంటున్న చంద్రబాబు ఏం చేశారో చెప్పాలని సూటిగా ప్రశ్నించారు. చిదంబరం, చంద్రబాబు మధ్య ఉన్న సంబంధాన్ని ఆయనే ఒప్పుకున్నారని విజయమ్మ అన్నారు.
తమకు, కాంగ్రెస్ పార్టీ పెద్దలకు హాట్ లైన్ లింకే ఉంటే తమ కుటుంబం ఎందుకింత బాధపడేదని విజయమ్మ అన్నారు. జగన్ జైల్లో ఎందుకు ఉండేవారని ప్రశ్నించారు. ఎవరివి వీధి నాటకాలో ప్రజలే గమనిస్తున్నారని ఆమె అన్నారు. భావోద్వేగాలకు లోనై ఏ ఒక్కరూ ఆత్మార్పణ చేసుకోవద్దని ఈ సందర్భంగా విజయమ్మ ఉద్యమకారులకు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా పోరాడి డిమాండ్లను నెరవేర్చుకుందామని విజయమ్మ సూచించారు.
0 comments:
Post a Comment