వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి విషమించిందనే వార్తల నేపథ్యంలో ఆయన తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతి ఉస్మానియా ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైఎస్ జగన్ ను కలిసేందుకు అనుమతించాలని పోలీసులకు వైఎస్ జగన్ కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. దాంతో వైఎస్ జగన్ వద్దకు వైఎస్ విజయమ్మ, భారతిలతో వారి కుటుంబ సభ్యులను అనుమతించారు.
గత ఆరు రోజులుగా దీక్ష చేస్తున్న వైఎస్ జగన్ ఆరోగ్యం శుక్రవారం సాయంత్రం విషమించినట్టు ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు వెల్లడించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే వైఎస్ జగన్ ఆరోగ్యం మరింత క్షీణించే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరించారు.
0 comments:
Post a Comment