జగన్ను వెళ్లి కలిసే పరిస్థితి లేనందు... పార్టీ చేసిన తీర్మానాన్ని, ఓ లేఖను పంపిస్తామని విజయమ్మ వెల్లడించారు. జగన్కు అటెండర్గా ఉండేందుకు తననుగాని, భారతిని గాని అనుమతించాలని కోర్టుకు విజ్ఞప్తి చేసినట్టు ఆమె తెలిపారు. కోర్టు ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఈ విపత్క పరిస్థితుల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎవరూ తొందరపడి ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని గద్గద స్వరంతో విజయమ్మ విజ్ఞప్తి చేశారు.
కాగా జగన్ దీక్ష, రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణామాల నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి శుక్రవారం సమావేశం అయ్యింది. జగన్ తక్షణమే దీక్ష విరమించాలని పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. అనంతరం విజయమ్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో అలిపిరి సంఘటన తర్వాత హింసను నిరసిస్తూ వైఎస్ రాజశేఖరరెడ్డి దీక్ష చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. రాష్ట్రంలో పరిస్థితి బాధ కలిగిస్తుందనని విజయమ్మ అన్నారు
0 comments:
Post a Comment