Home »
» విజయమ్మకు మద్దతుగా ఎస్వీ మోహనరెడ్డి ఆమరణ దీక్ష
విజయమ్మకు మద్దతుగా ఎస్వీ మోహనరెడ్డి ఆమరణ దీక్ష
ఎస్.వి. మోహన రెడ్డి
కర్నూలు: వైఎస్ఆర్ సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమరదీక్షకు సంఘీభావంగా మాజీ ఎమ్మెల్సీ ఎస్వీ మోహన్ రెడ్డి కర్నూలులో ఆమరణ దీక్ష చేపట్టారు. వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి, జిల్లా కన్వీనర్ గౌరు వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చరిత మద్దతు తెలిపారు.వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి పిలుపుతో ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని కార్యకర్తలు విజయమ్మ సమరదీక్షకు సంఘీభావంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు.ఇరు ప్రాంతాలకు న్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని విభజించవద్దని డిమాండ్ చేస్తూ వైఎస్ విజయమ్మ ఈరోజు ఉదయం గుంటూరులో సమర దీక్షను ప్రారంభించిన విషయం తెలిసిందే.
sakshi
0 comments:
Post a Comment