వైఎస్ పై నిందలు వేయటం సరికాదు: గుత్తా - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ పై నిందలు వేయటం సరికాదు: గుత్తా

వైఎస్ పై నిందలు వేయటం సరికాదు: గుత్తా

Written By news on Friday, August 9, 2013 | 8/09/2013

వైఎస్ పై నిందలు వేయటం సరికాదు: గుత్తా
నల్గొండ : ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతలు విరుచుకు పడ్డారు. కిరణ్ కుమార్ రెడ్డికి తెలంగాణపై మాట్లాడే నైతిక హక్కు లేదని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే చిలుమర్తి లింగయ్య వ్యాఖ్యానించారు. సొంత జిల్లాలో సర్పంచ్ లను గెలిపించుకోలేని ముఖ్యమంత్రి సిగ్గుంటే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి వైఖరిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని వారు తెలిపారు. తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు.... ముఖ్యమంత్రి కార్యక్రమాలను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. విభజనకు ఆధ్యుడు ... చనిపోయిన వైఎస్ రాజశేఖరరెడ్డే కారణమంటూ అపనిందలు వేయటం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొనాలని వారు సూచించారు.
Share this article :

0 comments: