వైఎస్ జగన్ నిరవధిక దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్జిల్లా వ్యాప్తంగా మహిళలు కదంతొక్కారు. కడప సహా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో భారీ ర్యాలీలు చేపట్టారు. పులివెందులలో వైఎస్ అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి ఆధ్వర్యంలో నారీభేరి చేపట్టారు. పులివెందుల ఆర్టీసీ బస్టాండ్ నుంచి ఎమ్మారో ఆఫీసు వరకు ర్యాలీ నిర్వహించారు. సుమారు 5 వేల మంది మహిళలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. వైఎస్ జగన్ దీక్ష విరమించే వరకు ఆందోళన కొనసాగిస్తామని పులివెందుల ప్రజలు స్పష్టం చేశారు. ప్రొద్దుటూరులో మహిళలు భారీ ర్యాలీ చేపట్టారు. పుట్టపర్తి సర్కిల్ వద్ద వంటా వార్పు కార్యక్రమం తలపెట్టారు.
మరోవైపు బైక్ ర్యాలీ చేసిన విద్యుత్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కలమల పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ కు నిరసనగా 2 వేల మంది విద్యుత్ ఉద్యోగులు కలమల పీఎస్ను చుట్టుముట్టారు. ఉద్యోగులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయకుంటే ఎస్పీ, కలెక్టర్ బంగ్లాకు విద్యుత్ నిలిపివేస్తామని విద్యుత్ జేఏసీ హెచ్చరించింది.
http://www.sakshi.com/video/news/pulivendula-people-supports-jagan-indefinite-fast-2864
మరోవైపు బైక్ ర్యాలీ చేసిన విద్యుత్ ఉద్యోగులను పోలీసులు అరెస్ట్ చేయడంతో కలమల పోలీసు స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. అరెస్ట్ కు నిరసనగా 2 వేల మంది విద్యుత్ ఉద్యోగులు కలమల పీఎస్ను చుట్టుముట్టారు. ఉద్యోగులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అరెస్ట్ చేసిన వారిని విడుదల చేయకుంటే ఎస్పీ, కలెక్టర్ బంగ్లాకు విద్యుత్ నిలిపివేస్తామని విద్యుత్ జేఏసీ హెచ్చరించింది.
http://www.sakshi.com/video/news/pulivendula-people-supports-jagan-indefinite-fast-2864
0 comments:
Post a Comment