వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా విషమించింది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై నిమ్స్ వైద్యులు శనివారం ఉదయం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. ఈ సందర్భంగా నిమ్స్ వైద్యుడు డాక్టర్ నగేష్ మాట్లాడుతూ దీక్ష విరమించేందుకు జగన్ అంగీకరించటం లేదని, ఆయన నిలబడితే కిందపడిపోయే పరిస్థితి ఉందని అన్నారు. జగన్ కు వెంటనే ప్లూయిడ్స్ ఎక్కించాలని నగేష్ తెలిపారు.
వైద్యానికి జగన్ సహకరించటం లేదని వైద్యులు వెల్లడించారు. బాడీ టెంపరేచర్ తగ్గిపోతుందని, బీపీ, పల్స్, షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్లు చెప్పారు. కీటోన్స్ 4+కు చేరుకున్నాయన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రమే వెల్లడించిన వైద్యులు..... బీపీ, షుగర్, పల్స్ రేట్ తదితర అంశాలపై వివరాలను వెల్లడించలేదు. డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో ఏడుగురు వైద్య బృందం జగన్ మోహన్ రెడ్డికి పరీక్షలు నిర్వహించారు.
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి జగన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. సమన్యాయం చేయాలంటూ వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష నేటికి ఏడోరోజుకు చేరింది. నిమ్స్ లో కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు.
వైద్యానికి జగన్ సహకరించటం లేదని వైద్యులు వెల్లడించారు. బాడీ టెంపరేచర్ తగ్గిపోతుందని, బీపీ, పల్స్, షుగర్ లెవల్స్ తగ్గిపోయినట్లు చెప్పారు. కీటోన్స్ 4+కు చేరుకున్నాయన్నారు. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మాత్రమే వెల్లడించిన వైద్యులు..... బీపీ, షుగర్, పల్స్ రేట్ తదితర అంశాలపై వివరాలను వెల్లడించలేదు. డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో ఏడుగురు వైద్య బృందం జగన్ మోహన్ రెడ్డికి పరీక్షలు నిర్వహించారు.
ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకు మరోసారి జగన్ ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు. సమన్యాయం చేయాలంటూ వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష నేటికి ఏడోరోజుకు చేరింది. నిమ్స్ లో కూడా ఆయన తన దీక్షను కొనసాగిస్తున్నారు.
0 comments:
Post a Comment