తెలంగాణ విషయంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆడుతున్న డ్రామా బయటపడిందని కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్రెడ్డి అన్నారు. కోవూరులోని మైథిలీ థియేటర్ ఎదుట వైఎస్సార్ విగ్రహం వద్ద ఆయన చేపట్టిన ఆమరణ దీక్ష బుధవారం మూడో రోజుకు చేరుకుంది. ప్రసన్నకుమార్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు మొదటి నుంచి రెండు కళ్ల సిద్ధాంతం అనుసరిస్తున్నాడని విమర్శించారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా మాట్లాడుతూ వచ్చారన్నారు.
తెలంగాణ ఇస్తే తప్పేంటి అని ఆయన వ్యాఖ్యానించి సీమాంధ్రుల మనోభావాల మీద దెబ్బకొట్టారన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రజలు, ఉద్యోగులు, నాయకులు రోడ్డెక్కి పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం రాష్ట్ర విభజనకు మొగ్గుచూసి తెలంగాణపై ప్రేమచాటుకున్నారన్నారు. ఆయన రెండు నాలుకల బాబు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విసుగెత్తిన అన్ని పార్టీలు అవిశ్వాసం పెడితే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్కు అండగా నిలవ డం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
బాబును తరిమి తరిమి కొడుతారు
సీమాంధ్ర బస్సు పర్యటనకు వస్తే చ ంద్రబాబును ప్రజలు తరిమి తరిమి కొడుతారని ఎమ్మెల్యే ప్రసన్న అన్నారు. తెలంగాణ ఇస్తే తప్పేంటన్న చంద్రబాబు సీమాంధ్ర పర్యటనకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఆందోళనతో ఆవేదన చెందుతున్నారన్నారు. ఈ సమయంలో వారి మనస్సుల్లోని జ్వాలాగ్ని చంద్రబాబును తిరిగి వెళ్లేంతవరకు తరుముతుందని హెచ్చరించారు.
తెలంగాణ ఇస్తే తప్పేంటి అని ఆయన వ్యాఖ్యానించి సీమాంధ్రుల మనోభావాల మీద దెబ్బకొట్టారన్నారు. సమైక్యాంధ్రకు అనుకూలంగా ప్రజలు, ఉద్యోగులు, నాయకులు రోడ్డెక్కి పోరాడుతుంటే చంద్రబాబు మాత్రం రాష్ట్ర విభజనకు మొగ్గుచూసి తెలంగాణపై ప్రేమచాటుకున్నారన్నారు. ఆయన రెండు నాలుకల బాబు అని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై విసుగెత్తిన అన్ని పార్టీలు అవిశ్వాసం పెడితే చంద్రబాబు మాత్రం కాంగ్రెస్కు అండగా నిలవ డం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమన్నారు.
బాబును తరిమి తరిమి కొడుతారు
సీమాంధ్ర బస్సు పర్యటనకు వస్తే చ ంద్రబాబును ప్రజలు తరిమి తరిమి కొడుతారని ఎమ్మెల్యే ప్రసన్న అన్నారు. తెలంగాణ ఇస్తే తప్పేంటన్న చంద్రబాబు సీమాంధ్ర పర్యటనకు ఎలా వస్తారని ప్రశ్నించారు. ప్రజలు ఆందోళనతో ఆవేదన చెందుతున్నారన్నారు. ఈ సమయంలో వారి మనస్సుల్లోని జ్వాలాగ్ని చంద్రబాబును తిరిగి వెళ్లేంతవరకు తరుముతుందని హెచ్చరించారు.
0 comments:
Post a Comment