డాలస్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ పై జైలు నుంచి విడుదలవడాన్ని డాలస్ ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ అభిమానులు స్వాగతించారు. జననేత 16 నెలల తర్వాత ప్రజల మధ్యలోకి వచ్చిన శుభసందర్భంలో ఆయన రాకను స్వాగతిస్తూ డాలస్ మహానగరంలోని మయూరి ఇండియా రెస్టారెంట్ లో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ముఖ్య అతిథిగా వ్యవహరించారు. కృష్ణారెడ్డి కోడూరు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. వైఎస్ జగన్ సేవలు ఆంధ్రప్రదేశ్ కి ఎంతో అవసరమని ఈ సందర్భంగా వక్తలు పేర్కొన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావలసిన అవసరముందని, ఆయన నాయకత్వం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని, ఆయన సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గురున్నాథ్ రెడ్డి, తోపుదుర్తి కవిత కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ ద్వారా డాలస్ వైఎస్ఆర్సీపీ అభిమానులతో మాట్లాడారు.
శ్రీధర్ రెడ్డి కొర్శపాటి, గుర్రం శ్రీనివాసుల రెడ్డి, జయ చంద్ర, ప్రతాప్ భీమిరెడ్డి, చిలుకూరి గోపి, రమణా పుట్లూరు, తిరుమల్, శ్రీనివాసులు, ఎన్ఎంఎస్ రెడ్డి, రమణా క్రిష్టపాటి, మురళి, సుధాకర్, మహేష్, సుబ్బారెడ్డి నార్పల, పల్గుణ, భాస్కర్ గడికోట, ఉమా మహేష్, జయ సింహా, ఉమా మహేశ్ కొర్రి మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావలసిన అవసరముందని, ఆయన నాయకత్వం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జగన్ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని, ఆయన సీఎం అవుతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు గురున్నాథ్ రెడ్డి, తోపుదుర్తి కవిత కాన్ఫరెన్స్ ఫోన్ కాల్ ద్వారా డాలస్ వైఎస్ఆర్సీపీ అభిమానులతో మాట్లాడారు.
శ్రీధర్ రెడ్డి కొర్శపాటి, గుర్రం శ్రీనివాసుల రెడ్డి, జయ చంద్ర, ప్రతాప్ భీమిరెడ్డి, చిలుకూరి గోపి, రమణా పుట్లూరు, తిరుమల్, శ్రీనివాసులు, ఎన్ఎంఎస్ రెడ్డి, రమణా క్రిష్టపాటి, మురళి, సుధాకర్, మహేష్, సుబ్బారెడ్డి నార్పల, పల్గుణ, భాస్కర్ గడికోట, ఉమా మహేష్, జయ సింహా, ఉమా మహేశ్ కొర్రి మనోహర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
0 comments:
Post a Comment