గుంటూరు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి బయటకొస్తే తమ అడ్రస్ గల్లంతవుతుందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు భయపడుతున్నారని ఆ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. అందుకే ఆయన ఢిల్లీ యాత్ర పేరుతో బెయిల్ రాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. జగన్ బెయిల్ను అడ్డుకునేందుకే ఆయన ఢిల్లీ యాత్ర అన్న విషయం టీడీపీ నేత పయ్యావు కేశవ్ కూడా అంగీకరించినట్లు చెప్పారు.
సుప్రీం కోర్టు సూచనల మేరకే జగన్ బెయిల్ పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు. ఇరుప్రాంత పార్టీ నేతల్ని ఢిల్లీ తీసుకెళ్లాలన్నది బాబు నాటకం అన్నారు. ఇప్పటికైనా సమైక్యవాదో, ప్రత్యేకవాదో బాబు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్లంతా టీడీపీకి ఎందుకు దూరమవుతున్నారో ఆలోచించాలన్నారు.
సుప్రీం కోర్టు సూచనల మేరకే జగన్ బెయిల్ పిటిషన్ వేసినట్లు ఆయన తెలిపారు. ఇరుప్రాంత పార్టీ నేతల్ని ఢిల్లీ తీసుకెళ్లాలన్నది బాబు నాటకం అన్నారు. ఇప్పటికైనా సమైక్యవాదో, ప్రత్యేకవాదో బాబు స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సీనియర్లంతా టీడీపీకి ఎందుకు దూరమవుతున్నారో ఆలోచించాలన్నారు.
0 comments:
Post a Comment