సమైక్యాంధ్రకోసం పోరాడుతున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన రెడ్డికి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక సభ్యులు అభినందనలు తెలిపారు. లోటస్ పాండ్ లోని వైఎస్ జగన్ నివాసంలో ఆయనను పరిరక్షణ వేదిక సభ్యులు శనివారం మధ్యాహ్నం కలిశారు.
త్వరలోనే తాము రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ కేంద్రానికి తీర్మానం పంపిస్తామని, ఆ తీర్మానంపై వైఎస్ జగన్ తొలి సంతకం చేస్తామన్నారని వేదిక సభ్యులు తెలిపారు. కేబినెట్ నోట్ కంటే ముందే అసెంబ్లీని తక్షణమే సమావేశపరిచి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని, తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖలిచ్చిన రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర సమన్వయకర్త వి.లక్ష్మణరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
త్వరలోనే తాము రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ కేంద్రానికి తీర్మానం పంపిస్తామని, ఆ తీర్మానంపై వైఎస్ జగన్ తొలి సంతకం చేస్తామన్నారని వేదిక సభ్యులు తెలిపారు. కేబినెట్ నోట్ కంటే ముందే అసెంబ్లీని తక్షణమే సమావేశపరిచి సమైక్యాంధ్ర తీర్మానం చేయాలని, తెలంగాణ విభజనకు అనుకూలంగా లేఖలిచ్చిన రాజకీయ పార్టీలు తమ అభిప్రాయాన్ని మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ వేదిక రాష్ట్ర సమన్వయకర్త వి.లక్ష్మణరెడ్డి ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
0 comments:
Post a Comment