రెచ్చగొడుతున్న కెసిఆర్: వాసిరెడ్డి పద్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రెచ్చగొడుతున్న కెసిఆర్: వాసిరెడ్డి పద్మ

రెచ్చగొడుతున్న కెసిఆర్: వాసిరెడ్డి పద్మ

Written By news on Sunday, September 29, 2013 | 9/29/2013

రెచ్చగొడుతున్న కెసిఆర్: వాసిరెడ్డి పద్మ
హైదరాబాద్: హైదరాబాద్ లో  సకల జన భేరీ బహిరంగ సభలో టిఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావు మాట్లాడిన మాటలను  వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ తప్పుపట్టారు. సీమాంధ్ర ప్రాంత ప్రజలను రెచ్చగొట్టేవిధంగా మాట్లాడారని మండిపడ్డారు. ఆంధ్రలో పుట్టినవారందరిని  తెలంగాణ ద్రోహులని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు.

సీమాంధ్రలో ఉన్నది మనుషులు కాదా? వారు చేస్తున్నది ఉద్యమం కాదా? అని అడిగారు. 60 రోజులుగా చేస్తున్న ఉద్యమాన్ని కించపరుస్తూ మాట్లాడటం భావ్యం కాదన్నారు. సీమాంధ్రలో గొప్ప ఉద్యమం సాగుతోందన్నారు. కాంగ్రెస్ రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా చేయడానికి ప్రయత్నిస్తే, కెసిఆర్ తన మాటల ద్వారా ముక్కలు ముక్కలు చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు.  కెసిఆర్ అహంకారపూరితంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరి ఇష్టప్రకారమే ఆనాడు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందని చెప్పారు. ఒక పక్క హైదరాబాద్ నుంచి వెళ్లిపోవలని అంటున్నారు, మరో పక్క కెసిఆర్ బండలేస్తున్నట్లు మాటలాడుతున్నారన్నారు. హైదరాబాద్ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం ఉందని పద్మ చెప్పారు.
Share this article :

0 comments: