దేవుడు గొప్ప దేవుడని, 16 నెలల నుంచి జైలులో ఉన్న జగన్ కు బెయిల్ వచ్చిందన్నారు. దేశవిదేశాలలోని ప్రజలందరి ప్రార్థనలు ఫలించాయన్నారు. జగన్ బాబు బెయిల్ పై బయటకు వస్తున్నారని ఆనందం వ్యక్తం చేశారు. రాజశేఖర రెడ్డి గారు మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత జగన్ ప్రజల పక్షాన నిలబడి పోరాడినట్లు చెప్పారు.
నాంపల్లిలోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఈ సాయంత్రం జగన్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు బెయిల్ రావడంతో కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఆనందంగా ఉన్నారు. రాష్ట్రం అంతటా సంబరాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్ లోని పార్టీ కేంద్ర కార్యాలయం జగన్ నినాదాలతో మారుమోగిపోయింది.
0 comments:
Post a Comment