సీబీఐ దర్యాప్తు పూర్తైనందున వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బెయిల్ మంజూరు చేయాలని జగన్ తరపు న్యాయవాది కోర్టును కోరారు. దర్యాప్తు పెండింగ్లో ఉందని సీబీఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు గతంలో బెయిల్ నిరాకరించిన విషయాన్ని గుర్తు చేశారు. బెయిల్ అనేది ప్రాథమిక హక్కని... వ్యక్తిపై ఆధారపడి బెయిల్ నిరాకరించడం తగదని చెప్పడంతోపాటు విచారణలో తనను తాను డిఫెండ్ చేసుకునేందుకు నిందితుడికి బెయిల్ మంజూరు చేయొచ్చంటూ సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను జగన్ తరపు న్యాయవాది వాదనల సందర్భంగా ప్రస్తావించారు.
బెయిల్ ఇచ్చిన తర్వాత సాక్ష్యుల్ని ప్రభావితం చేశారని భావిస్తే... బెయిల్ను రద్దు చేయొచ్చని కూడా కోర్టుకు హామీ ఇచ్చారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసని... రాజకీయ నాయకులు సీబీఐ డైరెక్టర్ను కలుస్తున్నారని జగన్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తెచ్చారు. ఏ ప్రాతిపదికన శిక్ష విధించమని కోరుతున్నారో అర్థం కావడం లేదని విచారణ సందర్భంగా న్యాయవాది వివరించారు. వాదనలు పూర్తయినందున కోర్టు వెలువరించే తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
0 comments:
Post a Comment