తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పేరు చెప్తే చాలు చంద్రబాబు బెంబేలెత్తిపోతారన్నారు. జగన్ బెయిల్ అంశం ప్రస్తావనకు రాగానే ఆయనకు ఢిల్లీ గుర్తుకు వస్తుందని, అలాగే ప్రధానికి లేఖ ఇవ్వాలన్న విషయం కూడా అప్పుడే గుర్తుకు వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ పెద్దలతో చంద్రబాబుకు సన్నిహిత సంబంధాలున్నా యన్నారు. కాంగ్రెస్ కు వ్యతిరేకంగా చంద్రబాబు ఉద్యమం చేయాల్సింది పోయి ఢిల్లీకి పోతున్నారని వ్యాఖ్యానించారు.
2008లో రాష్ట్ర విభజన కోసం చంద్రబాబు కేంద్రానికి లేఖ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు స్వయంగా గొడ్డలి ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు అని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో అత్యంత నీచమైన రాజకీయాలు నడుపుతున్న వ్యక్తి చంద్రబాబు అని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెడితే విప్ జారీ చేసి మరీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిన ఘనగ చంద్రబాబుని ఎద్దేవా చేశారు. దేశ చరిత్రలో ఓ ప్రతిపక్షనేత ఎన్నడూ ఇలా వ్యవహరించలేదని ఆయన పేర్కొన్నారు.
0 comments:
Post a Comment