తెలుగుదేశం పార్టీ, నారా లోకేష్ లు నిర్వహించిన సర్వేలు దొంగ సర్వేలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, గుర్నాథ్ రెడ్డిలు అభిప్రాయపడ్డారు. వారికి ఎక్కువ సీట్లు వస్తాయనటం అభూత కల్పనేనని వారు తెలిపారు. ప్రజలు తిరస్కరించినందునే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆత్మగౌరవ యాత్రను విరమించుకున్నారని విమర్శించారు. ప్రస్తుతం చంద్రబాబు అవలంభిస్తున్న తీరుపై వారు మండిపడ్డారు. చీకటి రాజకీయాలు చేయడానికే చంద్రబాబు ఢిల్లీ యాత్ర చేస్తున్నారన్నారు.
ఆయనకు చీకటి రాజకీయాలు చేయడం బాగా తెలుసని ఎద్దేవా చేశారు. బాబు ఎన్ని రాజకీయ కుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికు ఉన్న ప్రజాదరణను తగ్గించలేరని తెలిపారు. వైఎస్ జగన్మోహన రెడ్డికి వచ్చిన ఆదరణ తన కొడుక్కి రాలేదనే ఆందోళనతోనే చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారని గతంలో శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు
ఆయనకు చీకటి రాజకీయాలు చేయడం బాగా తెలుసని ఎద్దేవా చేశారు. బాబు ఎన్ని రాజకీయ కుట్రలు పన్నినా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహనరెడ్డికు ఉన్న ప్రజాదరణను తగ్గించలేరని తెలిపారు. వైఎస్ జగన్మోహన రెడ్డికి వచ్చిన ఆదరణ తన కొడుక్కి రాలేదనే ఆందోళనతోనే చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారన్నారని గతంలో శ్రీకాంత్ రెడ్డి విమర్శించారు
0 comments:
Post a Comment