పామర్రు (కృష్ణా), న్యూస్లైన్: ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెయిల్ను అడ్డుకోవటమే ప్రధాన ఎజెండాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నాడు. కాంగ్రెస్పై పగలు తిట్ల పురాణం, రాత్రి మంతనాలతో రాజకీయ నాటకాలు ఆడుతున్నాడు’అంటూ వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాస్చంద్రబోస్ దుయ్యబట్టారు. ఆదివారం కృష్ణా జిల్లా పామర్రులో పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి, సొంత ప్రయోజనాలకోసం ఎంతటి దారుణానికైనా తెగించే వ్యక్తి చంద్రబాబంటూ ధ్వజమెత్తారు. జగన్కు బెయిల్ వచ్చే సమయంలోనే బాబు బస్సు యాత్రను మధ్యలో ఆపి అర్ధంతరంగా ఢిల్లీ వెళ్లాల్సిన అవసరమేమిటని ప్రశ్నిం చారు. ఢిల్లీ వెళ్లి జగన్ బెయిల్ను అడ్డుకునే నీచ ప్రయత్నానికి ఒడిగడుతున్నారంటూ ఎద్దేవా చేశారు. బాబును జగన్ ఫోబియో పట్టి పీడిస్తోందన్నారు. ‘‘ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో రహస్య మంతనాలు జరిపి జగన్ బెయిల్ను అడ్డుకోవాలనే ఏకైక ఎజెండా బాబుది. అందుకోసం కాంగ్రెస్ అధిష్టానంతో చీకటి రాజకీయాలు చేయ టం, టీడీపీ ఎంపీలను దాని వద్దకు పంపడం ఆయనకు బాగా తెలుసు. ఢిల్లీలో కుతంత్ర రాజకీయాలకు తెర లేపడం బాబుకు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. కాంగ్రెస్తో ఆయన కుమ్మక్కును ప్రజలు గమనిస్తున్నారు’’ అన్నారు.
కేసుల మాఫీకి: బాబు తనతో అర్ధరాత్రి మంతనాలు జరిపారంటూ కాంగ్రెస్కు చెందిన కేంద్ర మంత్రి చిదంబరం స్వయానా పార్లమెంటులో బయట పెట్టారని పిల్లి గుర్తు చేశారు. కానీ ఆయన్ను ఎందుకు కలిసిందీ ఇంతవరకూ బాబు వివరణ ఇవ్వలేక పోయారన్నారు. ‘‘చిదంబరంతో పాటు సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్, కర్ణాటక గవర్నర్ హెచ్ఆర్ భరద్వాజ్, రేణుకా చౌదరి తదితరులను బాబు రహస్యంగా కలిసి ఏం మాట్లాడారో ప్రజలకు ఇప్పటికైనా చెప్పాలి. తనపై ఉన్న ఐఎంజీ, ఎమ్మార్, ఏలేరు, మద్యం తదితర కుంభకోణాలనుకప్పిపుచ్చుకునేందుకే బాబు ఇలా చేస్తున్నాడు.
దానికి తోడు రాష్ట్రంలో జగన్ ప్రభంజనాన్ని ఎదుర్కోవాలంటే తన బలం చాలడం లేదని భావించి కాంగ్రెస్తో మాట్లాడి కుమ్మక్కు రాజకీయాలకు పాల్పడుతున్నాడు. విపక్ష నేతగా ఉంటూ అధికార పక్షంతో కుమ్మక్కవడం ప్రపంచంలో ఒక్క బాబుకే సాధ్యమైంది’’ అంటూ ఎద్దేవా చేశారు. ‘‘కడప, పులివెందుల ఉప ఎన్నికల్లో టీడీపీ ఓట్లను కాంగ్రెస్కు బదిలీ చేయించడం నిజం కాదా? చిత్తూరు ఎమ్మెల్సీ ఎన్నికల్లోనైతే కాంగ్రెస్ను గెలిపించేందుకు కనీసం అభ్యర్థిని కూడా పోటీకి పెట్టలేదు. కాంగ్రెస్ సర్కారును అవిశ్వాస తీర్మానం బారి నుంచి కాపాడిందీ బాబేనని అందరికీ తెలుసు. ప్రజా సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తున్నది వైఎస్సార్సీపీ మాత్రమే. చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్కు హోల్సేల్గా అమ్మితే బాబు రిటైల్గా అమ్ముతున్నాడు’’ అంటూ దుయ్యబట్టారు. సీమాంధ్రలో బస్సుయాత్ర చేసిన చంద్రబాబు, సమైక్యాంధ్రకు కట్టుబడి ఉన్నానని ఎక్కడా చెప్పలేదేమని పిల్లి ప్రశ్నించారు. ఆయనకు నైతిక విలువలే లేవన్నారు. రాష్ట్రాన్ని విడదీయండంటూ లేఖ ఇచ్చి, యాత్రలు చేయటం సిగ్గుచేటన్నారు. బాబు కపట నాటకాలను జనం నమ్మే పరిస్థితి లేదన్నారు.
0 comments:
Post a Comment