బాబు ఏనాడైనా జైఆంధ్ర అన్నారా?:ఉమ్మారెడ్డి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బాబు ఏనాడైనా జైఆంధ్ర అన్నారా?:ఉమ్మారెడ్డి

బాబు ఏనాడైనా జైఆంధ్ర అన్నారా?:ఉమ్మారెడ్డి

Written By news on Thursday, September 12, 2013 | 9/12/2013

బాబు ఏనాడైనా జైఆంధ్ర అన్నారా?:ఉమ్మారెడ్డి
హైదరాబాద్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బస్సుయాత్రలో ఏనాడైనా జై ఆంధ్ర అన్నారా? అని వైఎస్ఆర్ సిపి సెంట్రల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ప్రశ్నించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు వైఎస్ జగన్‌కు బెయిల్‌ రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు.  సమైక్య ముసుగువేసుకుని ఆయన ఢిల్లీ వెళుతున్నారన్నారు.

నాలుగేళ్ల కాలంలో టిడిపి 46 చోట్ల పోటీచేస్తే  26 చోట్ల డిపాజిట్ గల్లంతయిందన్నారు. టీడీపీ ఓట్లు కాంగ్రెస్‌కు పడటం వల్లే డిపాజిట్లు గల్లంతయ్యయన్నారు.  ఎవరి ఆత్మగౌరవం కోసం బాబు యాత్ర చేశారని ఆయన ప్రశ్నించారు.  ఆనాడే అవిశ్వాసానికి మద్దతు పలికి ఉంటే ఈ ప్రభుత్వం కూలిపోయి ఉండేదన్నారు.
Share this article :

0 comments: