Home »
» కాంగ్రెస్తో వైఎస్ఆర్సీపీ కుమ్మక్కు అయివుంటే వైఎస్ జగన్ జైల్లో ఉండేవారా?
కాంగ్రెస్తో వైఎస్ఆర్సీపీ కుమ్మక్కు అయివుంటే వైఎస్ జగన్ జైల్లో ఉండేవారా?
కర్నూలు: జగనన్న జైలులో ఉన్నా, జనంలో ఉన్నా ఎప్పటికీ జన నేతే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఆమె కర్నూలు చేరుకున్నారు. ఇక్కడ జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. ఆమె ప్రసంగానికి భారీ సంఖ్యలో హజరైన జన సమూహం నుంచి విశేష స్పందన లభించింది. కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లింకుందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. ఇడుపులపాయకు, ఇటలీకి లింకుందని కూడా ఆయన అన్నారు. కాంగ్రెస్తో వైఎస్ఆర్సీపీ కుమ్మక్కు అయివుంటే వైఎస్ జగన్ జైల్లో ఉండేవారా? అని షర్మిల ప్రశ్నించారు. నిజానికి కాంగ్రెస్ తో కుమ్మక్కయింది టిడిపి అని మండిపడ్డారు. కాంగ్రెస్తో చంద్రబాబు కుమ్మక్కు కాకుంటే ఈ మైనార్టీ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుతారు? అని అడిగారు. వజ్రం లాంటి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ముక్కలు చేయాలని చూస్తుందటే అది చంద్రబాబు లేఖతోనే అన్నారు.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలకు తూట్లు పొడిచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనని విమర్వించారు. కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో వంగి వంగి దండాలు పెడుతున్నారన్నారు.
సమైక్య శంఖారావం సభకు అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. సభా ప్రాంగణం అంతా జైజగన్, సమైక్యాంధ్ర నినాదాలతో మారుమ్రోగిపోయింది.
0 comments:
Post a Comment