మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి

మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి

Written By news on Monday, September 2, 2013 | 9/02/2013

మహానేతకు కుటుంబ సభ్యుల ఘన నివాళి
ఇడుపులపాయ : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాలుగో వర్థంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆయన కుటుంబ సభ్యులు సోమవారం ఉదయం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి విజయమ్మ, కుమార్తె షర్మిల...ఇతర కుటుంబ సభ్యులు... పార్టీ నేతలు వైఎస్ సమాధి వద్ద అంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. విజయమ్మ, షర్మిల ఆదివారం రాత్రే ఇడుపులపాయకు చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ఇడుపులపాయ నుంచి షర్మిల తిరుపతి చేరుకుని అక్కడ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అక్కడ నుంచే ఆమె బస్సు యాత్ర ప్రారంభిస్తారు.
 
మరోవైపు వైఎస్ వర్థంతిని పురస్కరించుకుని పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ఆర్ సీపీ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టేందుకు నాయకులు ఏర్పాట్లు చేశారు. అంతే కాకుండా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ ను ప్రత్యేకంగా అలంకరించటంతో పాటు వచ్చే అభిమానులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
Share this article :

0 comments: