ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ను కోరామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, నెల్లూరు లోక్ సభ సభ్యుడు మేకపాటి రాజమోహనరెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ శనివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు రాజభవన్ లో గవర్నర్ ను కలసి విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజభవన్ బయట ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మేకపాటి మాట్లాడుతూ... అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ ప్రాంతాల్లోని ప్రజలు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారని గవర్నర్ కు వివరించామన్నారు.
రాష్ట్ర విభజనపై నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవాలని కోరామని చెప్పారు. ఓ వేళ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే హైదరాబాద్ లాంటి నగరం సీమాంధ్రలో నిర్మించుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందని అని మేకపాటి ప్రశ్నించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో తెలంగాణ, సీమాంధ్రుల శ్రమ ఉందని తెలిపారు. విభజన వల్ల ఏర్పడుతున్న సమస్యలపై పరిష్కారం చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించడం ఎంతవరకు కరెక్ట్ ఆయన మరోసారి ప్రశ్నించారు.
విభజన ప్రకటన వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, అవేమి పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు న్యూఢిల్లీలో తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఓ వైపు తగలబడుతోంటే చంద్రబాబు నీరో చక్రవర్తిలా వ్యవహారిస్తున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నవ్విపోతారన్నారు. చంద్రబాబుకు ఆత్మలేదు... గౌరవం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీలు రాజకీయంగా ఎదుర్కొనలేకే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనపై నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ వెనక్కి తీసుకోవాలని కోరామని చెప్పారు. ఓ వేళ ఆంధ్రప్రదేశ్ విభజన జరిగితే హైదరాబాద్ లాంటి నగరం సీమాంధ్రలో నిర్మించుకోవాలంటే ఎన్నేళ్లు పడుతుందని అని మేకపాటి ప్రశ్నించారు. హైదరాబాద్ నగర అభివృద్ధిలో తెలంగాణ, సీమాంధ్రుల శ్రమ ఉందని తెలిపారు. విభజన వల్ల ఏర్పడుతున్న సమస్యలపై పరిష్కారం చెప్పకుండా రాష్ట్రాన్ని విభజించడం ఎంతవరకు కరెక్ట్ ఆయన మరోసారి ప్రశ్నించారు.
విభజన ప్రకటన వచ్చిన తర్వాత నుంచి రాష్ట్రంలో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, అవేమి పట్టించుకోకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబు న్యూఢిల్లీలో తిరుగుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఓ వైపు తగలబడుతోంటే చంద్రబాబు నీరో చక్రవర్తిలా వ్యవహారిస్తున్నారని వ్యాఖ్యానించారు.
చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడితే రాష్ట్ర ప్రజలు నవ్విపోతారన్నారు. చంద్రబాబుకు ఆత్మలేదు... గౌరవం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీలు రాజకీయంగా ఎదుర్కొనలేకే తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ పై కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించాలని చూస్తోందని మేకపాటి రాజమోహన్ రెడ్డి పేర్కొన్నారు.
0 comments:
Post a Comment