http://www.ysrcongress.com/news/top_stories/smt-sharmilas-public-meeting-in-kavali-in-nellore-dist.html
8 సెప్టెంబర్ 2013: కాంగ్రెస్, టిడిపి నాయకులు ప్రజల అభిమతాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో, ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారో, ఏమిటి మన రాష్ట్రానికి పట్టిన కర్మ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్లు, సీట్ల కోసం పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెడతారా? అని కాంగ్రెస్, టిడిపిలను ఆమె నిలదీశారు. కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యే అసలు మనుషులేనా? లేక రాక్షసులా అని ఆమె నిప్పులు చెరిగారు. సమైక్య శంఖారావం బస్సు యాత్ర 7వ రోజు ఆదివారం రాత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ఆవేదనతో, ఉద్వేగంతో ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ వేసిన ఆంటోనీ కమిటీలో తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వారున్నారు కానీ ఒక్క తెలుగు వాడు కూడా సభ్యుడు లేని వైనాన్ని ప్రశ్నించారు. ఈ కమిటీ అభిప్రాయాలు సేకరించడం ఒక డ్రామా, ఆ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవడం అన్నది ఒక డ్రామా అన్నారు. కిరణ్, బొత్స అంతా ఢిల్లీలో ఆడుతున్నదంతా కూడా ఒక డ్రామా అన్నారు.
రాజశేఖరరెడ్డిగారు బ్రతికి ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండేదో మనందరికీ తెలుసు. రైతులను ఆయన ఎంతగానో ఆదరించారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ, ఎన్నో అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు చేసినప్పటికీ ఏ చార్జీలూ పెంచకుండా, ఏ ధరలూ పెంచకుండానే అద్భుతంగా నిర్వహించారన్నారు. రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయన పథకాలన్నింటికీ తూట్లు పెట్టిందని విమర్శించారు.
చేసిన పాపాలు చాలవన్నట్లు ఇప్పుడు మన రాష్ట్రాన్ని గొడ్డలితో నరికినట్లు రెండు ముక్కలు చేయడానికి పూనుకుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాపాన్ని చూస్తూ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాలర్ పట్టుకుని నిలదీయకుండా దానికే వత్తాసు పలుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయాలని చారిత్రక తప్పిదానికి పాల్పడడానికి చంద్రబాబు బ్లాంక్ చెక్కులా రాసివ్వడమే కారణం అన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా విప్ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడారని దుమ్మెత్తి పోశారు. ప్రతి ఎన్నికలోనూ చంద్రబాబు నాయుడు పాలు నీళ్ళులా కాంగ్రెస్తో కలిసిపోయి పనిచేశారు.
మహానేత వైయస్ఆర్ వారసుడిగా జగనన్న జనంలో ప్రాచుర్యం పొందుతుంటే చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కలిసిపోయి అబద్ధపు కేసులు పెట్టి అన్యాయంగా జైలులో పెట్టించారన్నారు. చంద్రబాబు తీరు చూస్తే ఒక వ్యక్తిని హత్య చేసి మళ్ళీ ఆ శవం మీదే పడి ఏడ్చినట్టు ఉందన్నారు. రాష్ట్ర విభజనకు చేసిందంతా చేసి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అంటూ సీమాంధ్రలో ఎలా చేస్తారని నిలదీశారు. కోట్లాది మందికి అన్యాయం జరుగుతున్నా ఓట్లు, సీట్లు పోతాయని, క్రెడిట్ తనకు దక్కకుండా పోతుందని చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనపై నోరు మెదపడంలేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజన చేస్తామని సంకేతాలు వచ్చిన మరు క్షణమే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా ఒక్కసారిగా తమ పదవులకు రాజీనామాలు చేసిన వైనాన్ని ప్రస్తావించారు. సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపిలు కూడా అప్పుడే రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రక్రియ ఆగిపోయేదన్నారు.
ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా న్యాయం చేయాలి, అది ఎలా చేస్తోరో అందరినీ పిలిచి చెప్పండని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ చెబుతోందని శ్రీమతి షర్మిల అన్నారు.
సీమాంధ్రులకు అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందాకైనా వెళుతుందన్నారు. చంద్రబాబు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎంతో కలిసి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయని ఎవరనుకుంటారన్నారు. అబద్ధాలు చెబుతూ చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నిజంగా సీమాంధ్ర గడ్డపై పుట్టి ఉంటే చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నాది తప్పే క్షమించండి అని చంద్రబాబు అనలేదంటే అసలు ఆయనలో ప్రవహిస్తున్నది మానవ రక్తమేనా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.
8 సెప్టెంబర్ 2013: కాంగ్రెస్, టిడిపి నాయకులు ప్రజల అభిమతాన్ని ఎప్పుడు అర్థం చేసుకుంటారో, ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటారో, ఏమిటి మన రాష్ట్రానికి పట్టిన కర్మ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్లు, సీట్ల కోసం పచ్చని రాష్ట్రంలో చిచ్చుపెడతారా? అని కాంగ్రెస్, టిడిపిలను ఆమె నిలదీశారు. కాంగ్రెస్, టిడిపి ఎంపిలు, మంత్రులు, ఎమ్మెల్యే అసలు మనుషులేనా? లేక రాక్షసులా అని ఆమె నిప్పులు చెరిగారు. సమైక్య శంఖారావం బస్సు యాత్ర 7వ రోజు ఆదివారం రాత్రి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కావలిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో శ్రీమతి షర్మిల ఆవేదనతో, ఉద్వేగంతో ప్రసంగించారు.
కాంగ్రెస్ పార్టీ వేసిన ఆంటోనీ కమిటీలో తమిళనాడు, కేరళ, కర్నాటక రాష్ట్రాలకు చెందిన వారున్నారు కానీ ఒక్క తెలుగు వాడు కూడా సభ్యుడు లేని వైనాన్ని ప్రశ్నించారు. ఈ కమిటీ అభిప్రాయాలు సేకరించడం ఒక డ్రామా, ఆ కమిటీ నివేదికను పరిగణనలోకి తీసుకోవడం అన్నది ఒక డ్రామా అన్నారు. కిరణ్, బొత్స అంతా ఢిల్లీలో ఆడుతున్నదంతా కూడా ఒక డ్రామా అన్నారు.
రాజశేఖరరెడ్డిగారు బ్రతికి ఉన్నప్పుడు మన రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉండేదో మనందరికీ తెలుసు. రైతులను ఆయన ఎంతగానో ఆదరించారన్నారు. రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ, ఎన్నో అభివృద్ధి పథకాలు విజయవంతంగా అమలు చేసినప్పటికీ ఏ చార్జీలూ పెంచకుండా, ఏ ధరలూ పెంచకుండానే అద్భుతంగా నిర్వహించారన్నారు. రాజశేఖరరెడ్డి రెక్కల కష్టంతో అధికారాన్ని అనుభవిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆయన పథకాలన్నింటికీ తూట్లు పెట్టిందని విమర్శించారు.
చేసిన పాపాలు చాలవన్నట్లు ఇప్పుడు మన రాష్ట్రాన్ని గొడ్డలితో నరికినట్లు రెండు ముక్కలు చేయడానికి పూనుకుందని ఆవేదన వ్యక్తంచేశారు. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పాపాన్ని చూస్తూ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కాలర్ పట్టుకుని నిలదీయకుండా దానికే వత్తాసు పలుకున్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేయాలని చారిత్రక తప్పిదానికి పాల్పడడానికి చంద్రబాబు బ్లాంక్ చెక్కులా రాసివ్వడమే కారణం అన్నారు. ప్రతిపక్షాలు అవిశ్వాసం పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు సిగ్గు లేకుండా విప్ జారీ చేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడారని దుమ్మెత్తి పోశారు. ప్రతి ఎన్నికలోనూ చంద్రబాబు నాయుడు పాలు నీళ్ళులా కాంగ్రెస్తో కలిసిపోయి పనిచేశారు.
మహానేత వైయస్ఆర్ వారసుడిగా జగనన్న జనంలో ప్రాచుర్యం పొందుతుంటే చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీ కలిసిపోయి అబద్ధపు కేసులు పెట్టి అన్యాయంగా జైలులో పెట్టించారన్నారు. చంద్రబాబు తీరు చూస్తే ఒక వ్యక్తిని హత్య చేసి మళ్ళీ ఆ శవం మీదే పడి ఏడ్చినట్టు ఉందన్నారు. రాష్ట్ర విభజనకు చేసిందంతా చేసి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర అంటూ సీమాంధ్రలో ఎలా చేస్తారని నిలదీశారు. కోట్లాది మందికి అన్యాయం జరుగుతున్నా ఓట్లు, సీట్లు పోతాయని, క్రెడిట్ తనకు దక్కకుండా పోతుందని చంద్రబాబు నాయుడు రాష్ట్ర విభజనపై నోరు మెదపడంలేదని దుయ్యబట్టారు.
రాష్ట్ర విభజన చేస్తామని సంకేతాలు వచ్చిన మరు క్షణమే వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులంతా ఒక్కసారిగా తమ పదవులకు రాజీనామాలు చేసిన వైనాన్ని ప్రస్తావించారు. సీమాంధ్ర కాంగ్రెస్, టిడిపిలు కూడా అప్పుడే రాజీనామాలు చేసి ఉంటే విభజన ప్రక్రియ ఆగిపోయేదన్నారు.
ఏ ఒక్క ప్రాంతానికీ అన్యాయం జరగకుండా న్యాయం చేయాలి, అది ఎలా చేస్తోరో అందరినీ పిలిచి చెప్పండని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచీ చెబుతోందని శ్రీమతి షర్మిల అన్నారు.
సీమాంధ్రులకు అన్యాయం జరుగుతుంటే జగనన్న చేతులు కట్టుకుని కూర్చోరని, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందాకైనా వెళుతుందన్నారు. చంద్రబాబు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎంతో కలిసి రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబుకు విలువలు, విశ్వసనీయత ఉన్నాయని ఎవరనుకుంటారన్నారు. అబద్ధాలు చెబుతూ చంద్రబాబు బస్సు యాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు నిజంగా సీమాంధ్ర గడ్డపై పుట్టి ఉంటే చెంపలేసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. నాది తప్పే క్షమించండి అని చంద్రబాబు అనలేదంటే అసలు ఆయనలో ప్రవహిస్తున్నది మానవ రక్తమేనా అని శ్రీమతి షర్మిల ప్రశ్నించారు.
0 comments:
Post a Comment