తెలుగుదేశంలో సుదీర్ఘకాలం ఉండి, మంత్రి పదవి కూడా చేసిన ప్రముఖ రైతు నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డిని ప్రశంసలతో ముంచెత్తడం ఆసక్తికరంగా ఉంది.ఆనాటి గవర్నర్ రంగరాజన్ , అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులు కలిసి అమలు చేసిన ప్రపంచ బ్యాంకు షరతులతో రైతులు నలిగిపోతున్న సమయంలో రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయి రైతు బాంధవుడిగా వచ్చారని వడ్డే మెచ్చుకున్నారు.ఆయా స్కీములు రాజశేఖరరెడ్డి చేపట్టి రైతులను ఆదుకున్నారని, పులిచింతల వంటి ప్రాజెక్టును ఆయన ఆరంభిస్తే, ఇప్పుడు దానిని పూర్తి చేయడం లో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. పోతిరెడ్డిపాడు ధైర్యంగా వెడల్పు చేయడం ద్వారా రాయలసీమను ఆదుకోవడానికి యత్నించారని, ఆయన జలయజ్ఞం గురించి వడ్డే అబినందించడం విశేషం.ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్న వడ్డే ఆయనను రాజకీయాలకు అతీతంగా మెచ్చుకోవడం విశేషం.వై.ఎస్.వర్ధంతి సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు
Source: kommineni.info
0 comments:
Post a Comment