'సీబీఐ కూడా ఇప్పుడు అదే తేల్చింది' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » 'సీబీఐ కూడా ఇప్పుడు అదే తేల్చింది'

'సీబీఐ కూడా ఇప్పుడు అదే తేల్చింది'

Written By news on Monday, September 23, 2013 | 9/23/2013

'సీబీఐ కూడా ఇప్పుడు అదే తేల్చింది'
హైదరాబాద్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసిన మహిళల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు బాలినేని శ్రీనివాసరెడ్డి, మేకపాటి, సోమయాజులు సతీమణులు ఉన్నారని ఓ పత్రిక  ప్రచురించిన అవాస్తవాలను ఆపార్టీ నేత శోభా నాగిరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆమె సోమవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ మహిళలు రాష్ట్రపతిని కలిసిన అంశంపై కూడా చంద్రబాబు విమర్శలు చేయటం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనమని మండిపడ్డారు.

ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు యాత్రలు చేస్తున్నారో చెప్పాలని శోభా నాగిరెడ్డి డిమాండ్ చేశారు. బాబు మళ్లీ పర్యటన చేస్తే సీమాంద్ర ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని డిమాండ్ చేశారు. జగన్ ను ఎదుర్కొనే సత్తాలేకే చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. క్విడ్ ప్రోకో జరగలేదని తాము మొదటనుంచీ చెబుతూనే ఉన్నామన్నారు. సీబీఐ కూడా ఇప్పుడదే తేల్చిందని శోభా నాగిరెడ్డి అన్నారు.
Share this article :

0 comments: