కేంద్ర హోం మంత్రి షిండేకు వైఎస్ విజయమ్మ లేఖ! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » కేంద్ర హోం మంత్రి షిండేకు వైఎస్ విజయమ్మ లేఖ!

కేంద్ర హోం మంత్రి షిండేకు వైఎస్ విజయమ్మ లేఖ!

Written By news on Friday, September 6, 2013 | 9/06/2013

కేంద్ర హోం మంత్రి షిండేకు వైఎస్ విజయమ్మ లేఖ!
హైదరాబాద్:
కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్ విజయమ్మ లేఖలో డిమాండ్ చేశారు. 
 
ఎంఐఎం, సీపీఎం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర విభజనకు వ్యతిరేకమని లేఖలో వెల్లడించారు. పార్టీల, ప్రజల ఇష్టాలను కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదని లేఖలో వెల్లడించారు. రాష్టర్ విభజనకు కేంద్ర ప్రభుత్వం నోట్ ను సిద్ధం చేస్తున్నట్టు మీడియాలో వార్తలు వెలువడుతున్నాయని లేఖలో తెలిపారు. 
 
ఓట్లు, సీట్ల ప్రతిపాదికన రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్రంలో 60 శాతం మంది విభజనకు వ్యతిరేకంగా ఉన్నారనే విషయాన్ని లేఖలో పేర్కోన్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీ ఆధారంగా కేంద్రం విభజనకు ముందుకెళ్తోందని, ఇప్పటికైనా మీ నిర్ణయాన్ని మార్చుకోండి అంటూ లేఖలో విజయమ్మ సూచించారు. 
Share this article :

0 comments: